Saturday, 27 May 2023

సముఖా హెచ్చరిక ఓ సర్వేశ్వరా

అన్నమాచార్య కీర్తన: సముఖా హెచ్చరిక ఓ సర్వేశ్వరా

రాగం: ఖమాస్

స్వరకర్త : శ్రీ మల్లాది సూరిబాబు గారు
గాత్రం : శ్రీరామ్ & గణేష్ (బాలబ్రదర్స్ )

|పల్లవి||సముఖా హెచ్చరిక ఓ సర్వేశ్వరా
అమరె నీ కొలువు ప్రహ్లాదవరదా



Oh Supreme Lord with a wide open mouth! The Lord Who bestowed the best on Prahlada! Be ready! Your court just begins.
(Note: Vara means the best, not just boon. Samukha is one who has a wide open mouth, standing for the Lord's lion face here).
||చ1|| తొడమీద గూచున్నది తొయ్యలి ఇందిరాదేవి
బడి చెలులు సోబాన పాడేరు
నడుమ వీణె వా‌యించీనినారదుడల్ల వాడె
అడరి చిత్తగించు ప్రహ్లాదవరదా
Sits on Your lap, the Supreme Goddess (Parameswari) Lakshmi, with goddesses accompanying Her singing in the praise of You both. In between, Narada palys his Veena. Listen carefully, Oh Narasimha Who graced Prahlada!
(Ind-means paramaiswarya per its Sanskrit root, Indira stands for the Supreme Goddess Lakshmi).
||చ2|| గరుడోరగాదులు ఊడిగములు నీకు జేసేరు
ఇరుమేలా గొలిచేరు ఇంద్రాదులు
పరమేష్టి ఒకవంక పనులు విన్నవించీ
అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా
Garuda and Sesha are serving You. Indra and others are assembled on either side of You and are paying obeisance to You. Brahma is submitting what needs to be done today, awaiting Your orders. Know that and pay attention, Oh Narasimha Who graced Prahlada!
||చ3|| పొదిగొని మిమ్మునిట్టే పూజించేరు మునులెల్లా
కదిసి పాడేరు నిన్ను గంధర్వులు
ముదమున అహోబలమునను శ్రీ వేంకటాద్రి -
నదె చిత్తగించుము ప్రహ్లాదవరదా
All the sages are worshipping You spontaneously, and Gandharvas are singing Your glory. Listen to it in Ahobilam and on Sri Venkatadri. Listen with rapt attention, Oh Narasimha Who graced Prahlada!

Thursday, 25 May 2023

Annamacharya's Srungara Keertanas - An analysis


అన్నమాచార్యుల వారి శృంగార కీర్తనలు - ఒక పరిశీలన
-----------------------------------------------------------------------
పురాణేతిహాసాల్లో నేను విన్నంత వరకూ, శ్రీవారికీ, అమ్మవారికీ మధ్య శృంగార పరమైన వర్ణనలు అంటూ లేవు. అన్ని చోట్ల ఉన్నవాడికీ, ఆయన దయకీ (motherly aspect) మధ్య ఎలా వర్ణిస్తారు? వారి సంబంధం నిత్యమైనది తప్పించి మానవపరమైన బంధం లాంటిది కాదు.
అమ్మవారు శ్రీవారిని కౌగిలించుకుంది అని చెప్పడానికి కూడా వాల్మీకి మహర్షి పెద్ద వివరణ ఇస్తాడు (శ్రీరామాయణం అరణ్యకాండ 30.39)
తమ్ దృష్ట్వా శత్రుహన్తారం మహర్షీణాం సుఖావహం
బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!
రాములవారు 14000 మంది రాక్షసులని సంహరించి మహర్షులకి సంతోషం కలిగించినపుడు అమ్మవారు ఆయనని హర్షంతో కౌగిలించుకుంది.
భాగవత విరోధులని (మన అహంకార మమకారాలు - ప్రతీకాత్మకంగా) ఆయన తొలగించి భాగవతోత్తములైన మహర్షులకి సుఖాన్ని (భగవద్ అనుభవాన్ని) ప్రసాదించినపుడు, విదేహ సంబంధమైన ఆయన కృప ఆయనని కౌగిలించుకుంది - ఇదీ అంతరార్థం. భగవత్ కృప వల్లే దేహ భ్రాంతి పోతుంది. అలాంటి దేహ భ్రాంతి లేని (విదేహ) రాజర్షుల వంశానికి చెందిన సీతని వైదేహి అంటారు.
అన్నమాచార్యుల శృంగార కీర్తనలని నేను చాలా చూసాను. కాస్తో కూస్తో తెలుగూ సంస్కృతం వచ్చి (కొందరికి చాలా బాగా వచ్చు), అటు అద్వైతంతో కానీ, అన్నమాచార్యుల వైష్ణవంతో కానీ పెద్దగా పరిచయం లేని వారు టన్నుల కొద్దీ వ్యాఖ్యానాలు రాసెయ్యడం వల్ల ఆయన శృంగార కీర్తనలు అమ్మవారికీ అయ్యవారికి మధ్యవిగా ప్రచారం పొందాయి.
కానీ ఎక్కువ శాతం నేను చూసిన కీర్తనలు జీవుడికీ, దేవుడికీ మధ్యవి. అయితే, వ్యాఖ్యానాలు రాసినవారిలో అధికశాతం అటు అద్వైతులూ కారు, ఇటు అన్నమయ్య సంప్రదాయస్థులూ కారు. బహుదేవతారాధకులైన కర్మసిద్ధాంతపరులు. అది కూడా ఈ ఆధునిక కాలంలో వారికి నచ్చిన పూజలూ, పునస్కారాలూ చేసుకునేవారు, ఒక పద్ధతిగా ఇంతకు ముందులాగ సంధ్యావందనం, అగ్నిహోత్రం వంటివి కాకుండా. అందువల్ల ఈ విషయం ఎక్కువ బయటకు రాలేదు.



శృంగారాన్ని శృంగారంగా చూడండి అని నాకు చెప్పిన వాళ్ళు, చెప్పే వాళ్ళు ఉన్నారు.
ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడండి అని వారికి నా సలహా. కవిత్వంలో ఏదీ డైరెక్టుగా చెప్పబడదు. దేవుడు తప్పక అనుగ్రహించును, అతనిని నమ్ముడి, అంటే అది కవిత్వం కాదు. ఏదో ప్రార్థన అవుతుంది!
అన్నమాచార్యుల సిద్ధాంతంలో ప్రతీకాత్మకంగా అందరూ స్త్రీ ప్రాయులే. భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఇది ఏ మాత్రం అసహజమైనది కాదు, జీవుడికి కాళ్ళూ కళ్ళూ లేవు. భగవంతుడు సమస్త ప్రపంచమూ నిండి ఉంటాడు. కాబట్టి తప్పుగా ఊహించడానికి ఏమీ లేదు! బ్రహ్మానందానికి ఒక మానవపరమైన పోలిక మాత్రమే.
జీవుడికి ఈశ్వరుడికి మధ్య సంబంధాన్ని చెప్పే అన్నమయ్య so called శృంగార కీర్తనల్లో consistency, pattern ఉంటాయి. వీటిని నేను అప్పుడప్పుడు పెట్టిన పోస్టుల నుంచి కూడా చూడవచ్చు.
బహుశా కాళిదాసు కుమారసంభవం వ్రాసినప్పటి నుండీ, ఆయనని అందరూ మహాకవిగా గౌరవించడం వల్ల, ఆయా సంప్రదాయాల్లోని దేవుడికీ అమ్మవారికీ మధ్య శృంగార పరమైన సాహిత్యం అందరూ మొదలు పెట్టారు. దీనికి కొన్ని కీర్తనల్లో అన్నమాచార్యులు కూడా మినహాయింపు కాదు.
భగవంతుడికి అమ్మవారికీ మధ్య వర్ణన చేసినప్పుడు అన్నమాచార్యులు అమ్మవారి పేరు నేరుగా ప్రస్తావిస్తారు. అలాగే జీవుడి విషయంలో చెప్పినట్టుగా అశక్తత, అజ్ఞానం, అసూయ (ఇంకో స్వామి భార్యని - అంటే మరొక జీవుడిని ఈర్ష్య పడటం), ఇలాంటివి అమ్మవారి పరంగా అన్నమయ్య చెప్పరు. ఇంకా నాయిక వర్ణన గంభీరంగా ఉంటుంది.
భగవంతుడికి అమ్మవారికి మధ్య చాలా శృంగార కీర్తనల్లో కూడా సందేశం ఉంటుంది. వాటిలో సంకేతార్థాలని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కొన్నింటిలో మాత్రం నాకు సందేశం కనిపించలేదు. బహుశా నేను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు, లేదా, ఆ కీర్తనలు కేవలం వేడుకగా పాడినవి కావచ్చు

Saturday, 24 September 2022

Entha Matramuna Evvaru Talachina

 అన్నమాచార్య కీర్తన: ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన

పాడిన వారు: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
స్వరకర్త: కడయనల్లూర్ వెంకటరామన్ (ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మొదట పాడినప్పుడు)
రాగం: బృందావని+మాయా మాళవ గౌళ రాగం
క్లుప్త వివరణ:
ఈ పాట అర్థం చేసుకోవడానికి చాలా మటుకు సులభంగానే ఉంది. అయితే ఒకటి రెండు సందేహాలు రావచ్చు.
  1. మొదటి చరణంలో విష్ణువును మొదట ప్రస్తావించి తర్వాత పరబ్రహ్మాన్ని ఎందుకు చెప్పారు అని.
  2. పిండంతే నిప్పటి అంటే ఏమిటి? నిప్పటి ఒక రాయలసీమ వంటకం. మరి వివిధ దైవాల గురించి, సామరస్యం గురించి చెపుతో పిండి కొద్దీ వంటకం అని ఎందుకు అంటున్నారు? ఈ సందేహం కూడా కలుగవచ్చు.
వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనను విష్ణువు అన్నాయి. విష్ణువు అనగానే వేదాల ప్రకారం త్రివిక్రముడు, ఇంకా పురాణేతిహాసాల ప్రకారం నరసింహుడు, రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు ధరించి అందరిలో కలసి ఒకడిగా తిరగడం, ఆయన మహత్తుని మనకు తెలియచేయడం, మనకు తాను ఉన్నాను అనే ఆశ్వాసనని ఇవ్వడం, ప్రేమ, దయ, వాత్సల్యం వగైరా వస్తాయి. ఎక్కడి వరకూ అంటే శ్రీవేంకటేశ్వరుడు మొదలైన రూపాల్లో ఆలయంలో మనల్ని అనుగ్రహించే దాకా!
అయితే వేదాల శిరోభాగమైన ఉపనిషత్తులు పరబ్రహ్మం అని, బ్రహ్మం అనీ తరచూ అంటూ ఉంటాయి. దీనిని అధ్యయనం చేసినవారు వారు భాగవతోత్తములు కావచ్చు, కాకపోవచ్చు, అపుడు వివిధ రకాలుగా భావించే అవకాశం ఉంది. అంతే కాకుండా పైన చెప్పిన గుణాలు అన్నీ పరబ్రహ్మం అన్నంత మాత్రాన ప్రకాశించవు. పరబ్రహ్మం అనే మాట ఆయన ఔన్నత్యాన్ని మాత్రమే చెపుతుంది. అందుకే మొదట విష్ణువు పేరు చెప్పారు.
ఇంక ఆఖరులో నీ వలన కొరతే లేదు, నీరు కొలది తామరవు అని చెప్పారు. పైగా గంగలోనూ, బావుల్లోనూ ఒకే జలం ఊరినట్టుగా దైవం ఒకటే అని చెప్పారు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆయన ఒకే దేవుడి గురించి చెప్పారు!
విష్ణువు అన్నప్పుడు ఒక వర్గానికి చెందిన దైవంగా కాకుండా సర్వవ్యాపి అయిన పరిపూర్ణ దైవంగా తీసుకోవాలి. ఇంక పరబ్రహ్మం అంటే ఆయన ఔన్నత్యాన్ని సూచించే పదమే! శివుడు పరమాత్మ సంహార మూర్తి. భైరవుడు ఆ శివుడి అంశమే. శక్తి పరమాత్మ మాయయే.
ఇలా భగవంతుడి కంటే వేరైన విషయాల్ని అసలు అన్నమయ్య ప్రస్తావించనే లేదు. అందుకే భగవంతుడిని అన్ని చోట్ల ఉన్న ఒకే జలంతో పోల్చారు.
దైవాలని భౌతికంగా ఊహించుకున్న వారే విష్ణువనీ, శివుడనీ, శక్తి అనీ, కాదు ఇద్దరో ముగ్గురో ఒకటే అనీ, దెబ్బలాడుకుంటుంటారు. వీరిలో ఎవరి నమ్మకం వారికి ఉన్న ఉత్తములూ ఎందరో ఉన్నారు.
పల్లవిలో "పిండంతే నిప్పటి అన్నట్టు" అని చెప్పడంలో అంతరార్థం ఇదే!
Brief Description:
-------------------
This song is pretty much easy to understand for those knowing Telugu. However one can have two doubts.
1. Why in the first stanza Vishnu is mentioned first and then Parabrahman?
2. What is "pinDanthE nippaTi" or a dish called "nippaTi" according to the quantum of flour? NippaTi is a Rayalaseema dish. In a song that mentions various deities and talks about harmony, why is it said that dish as per the flour available? This doubt can
also arise.
The Vedas, epics and purANas call Lord Vishnu because he is omnipresent. Vishnu, who is Trivikrama according to the Vedas, according to purANas and itihAsas, takes in the incarnations of Narasimha, Rama, Krishna, etc., mingling with us easily, letting us know His greatness, giving us the assurance that He is there for us, showing love, kindness, affection, and so on.
This goes on to the extent of blessing us in temples in the form of Sri Venkateswara etc.
However, the Upanishads, considered to be the head of the Vedas, often refer to Him as Parabrahman and Brahman. Those who have studied it may or may not be great Bhagavatas, then it is possible that they think differently.
Apart from that, not all of the above qualities shine by saying He is Parabrahman. The word Parabrahman only speaks of his exalted stature. That is why Vishnu's name was mentioned first.
And in the end is is said that there is no shortage because of You, the Supreme Lord and You are like a lotus that grows according to the plentifulness of water. Moreover, it is said that God is the same as the same water in the Ganges and wells. Take a closer look and he says the same God and not different deities!
Vishnu should be taken to be the omnipresent perfect deity rather than a sectarian deity. Parabrahman is the word that signifies His exaltation! Lord Shiva is the divine slayer. Bhairava is an aspect of that Shiva. Shakti is the will or Maya of Vishnu.
Thus Annamayya does not mention anything other than the Supreme Being. That is why God is compared to the same water present everywhere. If you think He is in Ganga, He is in Ganga. If you think He is in a well, He is in a well. As simple as that.
పల్లవి:
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
చరణం 1:
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
చరణం 2:
సరి నమ్ముదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు గరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
చరణం 3:
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణనియెదను, ఇదియే పరతత్వము నాకు
Audio link below:


Sunday, 11 September 2022

The divine mother the personification of His grace is the sole refuge for all

 ॥పల్లవి॥ శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

వాసుదేవుఁడా రమణీవశమైయుండఁగను


భగవద్ రామానుజుల వారు అశరణ శరణ్యామ్ అని శరణాగతి గద్యంలో చెప్పినట్టుగా భగవత్కరుణ శ్రీదేవి మాత్రమే జీవులందరికీ దిక్కు. 

శ్రీయతే ఇతి శ్రీ, శ్రయతే ఇతి శ్రీ, అంటే, మనల్ని భగవంతుడికి ఆశ్రయింపచేసేదీ, భగవంతుడిని నిరంతరం ఆశ్రయించి ఉండేదీ, జగన్మాతే. 


శ్రీవాసుదేవ మహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ అని లక్ష్మీ సహస్రనామాల్లో చెప్పినట్టు అమ్మవారు పురుషోత్తముడైన వాసుదేవుడికి కూడా ఈశ్వరి. భగవంతుడు తన కృపకి తానే వశం అయి ఉంటాడు అని అర్థం. ఈ విధంగా అన్నమయ్య కీర్తనల్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. 

క్షీరాబ్ధౌ శ్రీర్యథా జాతా పూర్వం భృగు సుతా సతీ అన్నది శ్రీవిష్ణుపురాణం. పూర్వం భృగుమహర్షి కూతురుగా ఆవిర్భవించిన సతి శ్రీదేవి క్షీరాబ్ధి కన్యకగా వచ్చింది అని అర్థం.  

 సత్తా అంటే అర్థవంతమైన ఉనికి అని అర్థం. భగవంతుడి లాగే శుద్ధసత్త్వరూపిణి అయిన లక్ష్మీదేవిని అందుకే శ్రీసతి అంటారు. 

అదే విధంగా  భర్త జీవితానికి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి భార్యని సామాన్య పరిభాషలో  సతి అని పిలుస్తారు. 


॥చ1॥ సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు

నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను

యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా

కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను


కాకాసురుడికి లోకాలన్నిట్లో ఎవరూ శరణు ఇవ్వకపోతే అపుడు సీతాదేవితో కూడిన రాముడినే ఆశ్రయిస్తే రాముడు రక్షించాడు. 

రావణాసురుడు అహంకారంతో సీత తన అధీనం కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు. ఏమైందో తెలిసినదే. 

॥చ2॥ కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి

అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను

యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా

తుద సభలో వదరి తునకలై పడెను


రుక్మిణీదేవితో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తుండగా అడ్డు వచ్చిన రుక్మిని అమ్మవారు ప్రార్థిస్తే కృష్ణుడు చంపకుండా అతని జుట్టూ గడ్డమూ మీసాలూ ఒకవైపు కోసేసి పరాభివించి వదిలేస్తాడు. 


అదే కృష్ణుడు ఒక్కడూ వెళ్లిన రాజసూయ యాగంలో శిశుపాలుడి నూరవ తప్పుకి అతనిని చంపివేస్తాడు. 


॥చ3॥ సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య

గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను

పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు

గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను

శ్రీదేవి నరసింహ స్వామి తొడపై ఉండగా దైత్య గురు పుత్రులు అంటే హిరణ్యకశిపుడి ఇతర కుమారులూ, ప్రహ్లాదుడి గురువు కుమారులూ, మొదలైన వారు కావచ్చు. వాళ్ళు ప్రహ్లాదుడిని ఎంత హింసించిన వారైనా భగవంతుడు వీరందరూ నిజానికి నా పిల్లలే కదా అని దయతో వదిలేసాడు. 


అదే తాను ఆవిర్భవించినపుడు హిరణ్యకశిపుడిని మాత్రం అప్పటికప్పుడే చీల్చి వధించాడు. 


శూర్పణఖ సీత వద్దు రాముడే కావాలి, ఈమె ఏదో మానవస్త్రీ, నాకు ప్రతిబంధకమైనది అనుకున్నట్టుగా, లక్ష్మీదేవి లేని నారాయణుడు రక్షిస్తాడు, ఆయనే కావాలి, ఈవిడ ఎవరో ఒక దేవత మాత్రమే, అని భేద భావంతో వేరుగా తలిచేవారికి ఈ కీర్తన చక్కని బోధ. 

Click below for a link to an audio visual:





Ksheerabdhi Kanyakaku

అన్నమాచార్య కీర్తన:
*క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని*
*నీరజాలయకును నీరాజనం*

గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం: మధ్యమావతి
రేకు: 1050-1
సంపుటము: 20-295
రేకురాగము: మంగళకౌశిక

పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం

చరణం1:
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణం2:
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

చరణం3:
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం

వివరణ:
సులభంగానే పదాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా రాయట్లేదు.

పల్లవి:
ఇందులో క్షీరాబ్ధి కన్యకకు అంటే అంతకు ముందు అమ్మవారు లేదా అనే సందేహం వస్తుంది. భగవంతుడితో పాటు నిత్యమూ ఉండే ఆయన కృప సృష్టి జరిగాక మొదట భృగు మహర్షి కూతురిగా ఆవిర్భవించింది. దేవతలు కష్టాల్లో ఉన్నపుడు వారిని అనుగ్రహించడం కోసం మళ్ళీ క్షీరసముద్రంలో ఆవిర్భవిస్తుంది.
భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముధధేః పునః
దేవ దానవ యత్నేన ప్రసూతామృత మంథనే|
అని శ్రీవిష్ణుపురాణం చెపుతోంది. భాగవతం కూడా ఇదే చెప్పింది.

లక్ష్మి అంటే అర్థం గతంలో నా పోస్టుల్లో చూసాం. ఒక్క ముక్కలో లోకమాత అని అర్థం చెప్పుకోవచ్చు.

చరణం1:
పద్మాలు మార్దవానికి చిహ్నాలు. నేత్రాలని పోల్చినపుడు సర్వాన్నీ దర్శించే సామర్థ్యాన్ని చెపుతాయి.
జలజాక్షి ముఖం కూడా జలజమే!

కుచాల గురించి గతంలో చెప్పాను. అమ్మవారికి అయినా, ఒక మగవాడికైనా, ఒక జడవస్తువుకి అయినా భగవంతుడికి మాత్రమే చెంది ఉండటం అనే లక్షణాన్ని సూచిస్తాయి. భగవంతుడు భర్త!

కొప్పు జ్ఞానానికి ప్రతీక. ఇంక వరద అభయ హస్తాల గురించి చెప్పక్కర్లేదు.

చరణం2:
పాదపద్మాలు (చరణ కిసలయమ్ములు) శ్రీమన్నారాయణుడి శరణ్యత్వానికి చిహ్నాలు.

అమ్మవారు ఆశరణ శరణ్య అయితే భగవంతుడు అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు (భగవద్ రామానుజులు చెప్పినట్టుగా). శరణు లేని వారికి ఆవిడ శరణం అయితే, ఏమీ ఆలోచించకుండా సమస్త లోకాలకీ ఆయనే శరణు! ఇంక ఇద్దరికీ తేడా ఏమిటి? అందుకే పెద్దలు ఒక ప్రత్యేక దేవతగా కాకుండా మూర్తీభవించిన భగవత్ కృపగా చెపుతారు.

ఊరు అంటే ఆధారం అయినది. రంభ అంటే వెదురు. రంభోరు అంటే వెదురు వంటి బలహీనమైన తొడలు లేదా మోకాలికీ పాదానికీ మధ్య భాగం కలిగినది అని చెప్పవచ్చు. అంటే భగవంతుడే తప్ప వేరే ఆధారం లేనిది ఆయన కృప.

అయ్యవారు కల్పవృక్షం అయితే అమ్మవారు కల్పలత అని శ్రీవిష్ణుపురాణం.

జఘనం అన్నా ఇదే అర్థం వస్తుంది. జఘనం రాగానికి కూడా చిహ్నం. అరిది జఘనం అంటే అరుదైన అంటే ఉందీ లేదా అన్నట్లు ఉన్న నడుము! అమ్మవారికి అయ్యవారిపై ఎంతో రాగం ఉన్నప్పటికీ, అయ్యవారి రాగంతో పోలిస్తే అమ్మవారి ఉండీ లేనట్టుట! అమ్మవారి విషయంలో నహి నిందా న్యాయం. జీవుల విషయంలో సహజం. అందుకే అన్నమయ్య నాయికా భావంలోని శృంగార కీర్తనల్లో కూడా సన్నని నడుముగా చెపుతారు జీవుడికి.

ఇంకా అమ్మవారికి అయ్యవారిపై ఆధార పడటమే తప్పించి ప్రత్యేకంగా అస్తిత్వం లేదు అని నేను చక్కని తల్లికి చాంగుభళా కీర్తనలో రాసిటనట్టు కూడా జఘనం (నడుము) విషయంలో చెప్పవచ్చు. దీనికి స్త్రీ పురుషుల్లో ఎవరు గొప్ప ఇలాంటి అర్థాలు తియ్యకూడదు. భగవంతుడు స్త్రీ పురుషనపుంసక భేదాలకి అతీతుడు.

నాభి అంటే కేంద్రం. భగవదనుగ్రహానికి ఆయన దయే మూలం!

చరణం3:
పట్టపు రాణి అని ఎందుకు అన్నారు అంటే, భగవంతుడికి ప్రపంచంలో ఉన్నవారు అందరూ భార్యలే! అయితే సమస్త విశ్వంలో ఉన్న జీవుల పట్ల ఆయన దయ లేదా శ్రద్ధని శ్రీదేవిగా, భూలోకంలో ఉన్న మన అందరి పట్ల శ్రద్ధని భూదేవిగా, ప్రతి ఒక్క జీవి పట్ల ఉన్న శ్రద్ధని నీళాదేవిగా చెపుతారు. అంచేత శ్రీదేవి పట్టపురాణి!

Click here for an audio visual:




Friday, 5 August 2022

The cloud and the lightning!

తాళ్లపాక పెద తిరుమలాచార్య కీర్తన
॥పల్లవి॥
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె
స్వామి ముఖంలో కళలు ఒకదానితో ఒకటి వయ్యారంగా పోటీపడుతూ మరీ ఆవిష్కరించబడ్డాయిట. ఏమిటి ఆ కళలు అంటే ఎంతైనా చెప్పవచ్చు. కళ్ళు, విల్లు లాంటి కనుబొమలు, చిరునవ్వుతో కూడిన పెదాలు, ముంగురులు, వీటన్నిటినీ వర్ణించుకుంటూ పోతే ఎంతైనా చెప్పవచ్చు. సర్వత్ర ఉన్న దేవుడికి కళ్ళు ఏమిటి, నోరు ఏమిటి అని అడిగితే దానికీ సమాధానం ఉంది!
॥చ1॥
జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంకఁ జిందఁగాను
మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనక
పొగరువెన్నెల దీగఁబోసినట్లుండె
జగత్పతి శ్రీవేంకటేశ్వరుడి తిరుమంజన సమయంలో (అభిషేకం) ఆయనపై చల్లిన కర్పూరం అన్ని వైపులా చిందగా, అది చంద్రముఖి అయిన అమ్మవారి వెన్నెలా అన్నట్టుగా ఉందిట!
అమ్మవారు చంద్రముఖి అయితే ఆయన ఆ చంద్రుడికి నివాసం అయిన ఆకాశం. వ్యాపకత్వ లక్షణం ఉన్న కర్పూరం వెన్నెల లాగ ఉంది.
ఉరమున నిలిపె అంటే తన వక్షస్స్థలం మీద ఆ దయాదేవికి ఆధారం ఏర్పరిచాడు. ఇంతకు ముందు ఒక సారి రాసినట్టుగా హృదయాన్ని దయకి స్థానంగా చెపుతారు. ఇది చాలా సాధారణమే.
॥చ2॥
పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టుపుణుఁగు
కరఁగి యిరుదెసలఁ గారఁగాను
కరిగమనవిభుఁడు గనక మోహమదము
తొరిగి సామజసిరి దొలఁకినట్లుండె
పునుగు పిల్లి నుంచి స్రవించే కస్తూరి ఎంతో చక్కటి వాసన కలిగినది. ఈ విధంగా కస్తూరి మృగాన్ని భగవంతుడి విభూతిగా (special manifestation) భావించి దాని నుంచి వచ్చిన కస్తూరితో ఆయనకి తిలకం దిద్దుతారు. అభిషేక సమయంలో ఆయన చెక్కిళ్ళకు రాసిన కస్తూరి కిందకు కారగా, అది ఏనుగు మదం లాగా ఉందిట. ఎలా అంటే ఆవిడ కరిగమన కాబట్టి (ఏనుగు వంటి నడక కలది, స్త్రీలని ఇలా పోలుస్తారు) దానికి అనుగుణంగా ఒక మదపుటేనుగు మదం తొలికినట్టుగా.
ఈ మోహం ఎవరి మీద అంటే, తన కృప అయిన ఆవిడ మీద. తన కృపకి వశుడై మనల్ని అనుగ్రహిస్తాడని అర్థం.
ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. ఆవిడ ఈశ్వరి అయితే ఆయన ఆవిడకే ఈశ్వరుడు. శ్రీశః అంటే శ్రీకి ఈశ్వరుడు, తనకి శ్రీని ఈశ్వరిగా కలిగినవాడు అని రెండు అర్థాలు ఉన్నాయి.
శ్రీరామాయణంలో అయితే అమ్మవారూ అయ్యవారూ ఒకపరికొకపరి అన్నట్టుగా ఇద్దరూ కూడా, భగవంతుడు సూర్యుడు అయితే అమ్మవారు సూర్యప్రభ అని పోటీ పడి మరీ చెపుతారు.
శ్రీవారు "అనన్యార్హా మయా సీతా భాస్కరేణ ప్రభా యథా" అంటే, అమ్మవారు "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా" అని అంటారు.
॥చ3॥
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుఁబోణి యలమేలుమంగయుఁ దాను
మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె
ఆయన శరీరం మీద స్వర్ణాభరణాల్ని ధరించగా, ఆ ఆభరణాలే మెరుపు తీగల్లాగా, ఆయన కారుమబ్బు లాగా అనిపించింది. నారాయణ సూక్తంలో "నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అన్నదానికి అర్థం కారుమబ్బువంటి శ్రీమన్నారాయణుడిలో జగన్మాత విద్యుల్లేఖ అంటే మెరుపు తీగ లాగా భాసిస్తోందట. కారుమబ్బు కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న స్వామికి సంకేతం అయితే, మెఱుపు ఆయనని మనకి దర్శింపచేసేది. మెఱుపు వచ్చీ పోయినట్టుగానే ఆయన మనకి తెలిసీ తెలియకుండా ఉంటాడు! శ్రీవేంకటాచలంపై మాత్రం నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంటాడు!
మొదటి రెండు చరణాల్లో వ్యాపక లక్షణాలు ఉన్న కర్పూరం, వెన్నెలా, కస్తూరిలని ఎంచుకోవడం కూడా భగవంతుడూ ఆయన కృపల వ్యాపకత్వానికి చిహ్నం.



Sunday, 26 June 2022

Poetic symbolism in Sat Sampradaya Literature

ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే అన్నమాచార్య కీర్తనలకు అర్థం తెలుసుకోవడం చాలా సులభం అని ఈ పోస్టు ఈ బ్లాగులో చేర్చడం అయ్యింది. 


1వ భాగం, ఉపోద్ఘాతం 

----------------------------

కమలా కుచ చూచుక కుంకుమతో 

నియతారుణితాతుల నీల తనో 

కమలాయత లోచన లోకపతే 

విజయీభవ వేంకట శైలపతే

అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం. 

దేవుడు ఆడా మగా? జగన్మాత అని మళ్ళీ ప్రత్యేకంగా ఏమిటి? దేవుడు నీలంగా ఉంటాడా? ఒక వేంకటాద్రి మీదనే ఉంటాడా? ముందు సుప్రభాతంలో మాతః సమస్త జగతాం అని చెప్పి మళ్ళీ ఈ మొదటి రెండు లైన్లు ఏమిటి? 

దేవుడు నీలంగా ఉంటాడు అంటే ఎవరో చూసినట్టు కాదు. ఒక నీలి మబ్బు కమ్ముకున్నట్టుగా మనల్ని తన అనుగ్రహంలో తడిసి ముద్ద చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడుట. ఇలా అనుకోవడం వల్ల ఒక విధమైన ధైర్యం వస్తుంది. భగవంతుడు తెల్లగా ఉంటాడు అంటే స్వచ్ఛతకు ప్రతీక. 

ఇంక కమలాదేవి ఎవరు? కమలంపై ఉండే దేవి, కమలం మార్దవానికి ప్రతీక. ఆవిడని ఎవరైనా చూసారా?

అసలు వాల్మీకి రామాయణంలో సాగర మథనం మొత్తం చెప్పి అమ్మవారు సాగరంలో పునరావిర్భవించిన కథ కూడా చెప్పలేదు. వేదంలో శ్రీసూక్తంలో కూడా రూపం ఇది అని చెప్పలేదు. 

మరి అమ్మవారికి నాలుగు చేతులతో ఒక రూపంతో ఎందుకు కొలుస్తారు? లక్ష్మీ దేవిని సీతగా వాల్మీకి వర్ణించారు. అంతకంటే విలక్షణంగా ఆ సీతకు మూలమైన అమ్మవారిని  అదే వాల్మీకి వర్ణించిన రూపంతో, కానీ  నాలుగు చేతులతో కొలుస్తారు. BTW, వాల్మీకి రామాయణం దేవుడికి శ్యామ వర్ణం  (నల్లని దేహం, కారు మబ్బుని సూచించే విధంగా) చెపుతుంది!

మరి ఆవిడ ఎక్కడ ఉంటుంది? భగవంతుడి వక్షస్స్థలంలో అట. భగవంతుడు అంటే ఏవో నాలుగు చేతులతో ఎవరికీ తెలీని లోకంలో ఉంటాడా? అలాంటపుడు ఆయనని అసలు తలవడం ఎందుకు? అంతకంటే గొప్ప విషయాలు చాలా లేవా?

పురుష సూక్తం విశ్వరూపం చెప్పింది. 

మరి విశ్వరూపం అయితే, ఏది తల, ఏవి చేతులు, వక్షస్స్థలం ఎక్కడ ఉంటుంది?

ఇపుడు వక్షస్స్థలం అనే మాటను తీసేద్దాం. తెలుగు సంస్కృతాల్లో హృదయం, తమిళంలో మార్బు, ఇంగ్లీషులో heart. 

ఎవరైనా సహృదయుడు, kind hearted అంటే అర్థం ఏమిటి? ఎదుటి వారి పట్ల సానుభూతి ఉంది అని అర్థం. 

అలాగే అమ్మవారు భగవంతుడి హృదయంలో ఉంది అంటే, ఆయన దయామయుడు అని అర్థం. ఈ పోస్టు ఏ శ్లోకం గురించి రాయబడ్డదో  ఆ స్తోత్ర రచయిత అణ్ణన్ స్వామి గురువు గారు అయిన శ్రీమద్ వేదాంత దేశికులు అమ్మవారిని శ్రీనివాసుడి దయాదేవిగా చెపుతూ ఒక శతకమే రాసారు. 

దయ కృప శ్రద్ధ ఇవన్నీ మాతృ లక్షణాలు కాబట్టి, భగవంతుడి ఈ లక్షణాన్ని జగన్మాతగా చెప్పారు. అంతే కాకుండా, "మాతా చ కమలా దేవీ పితా దేవో జనార్దనః" అని చాణక్యుడు చెప్పిన శ్లోకం ప్రకారం చూసినా, తల్లిదండ్రుల కాన్సెప్టులో జగన్మాత, జగత్పిత   అని భావిస్తే మనసుకు బావుంటుంది. లేక పోతే నిజానికి భగవంతుడు ఆడా మగా అని చెప్పలేం. జగత్పతి అన్నపుడు మాత్రం  అది పుంలింగంలోనే ఉంది. ఒకే భగవంతుడు తల్లీ, తండ్రీ, పతీ అన్నపుడే ఇది భౌతికంగా ఆలోచించేది కాదు అని తట్టాలి!

పైన వక్షస్స్థలం గురించి చెప్పిన లాజిక్కే సర్వాంతర్యామి కనులకు కూడావర్తిస్తుంది, "కమలాయత లోచన" అన్నప్పుడు. పైగా లక్ష్ అనే ధాతువుకు "ఆలోచనే" అని అర్థం. అంటే తెలుగులో ఆలోచన కాదు. లక్షించి (చూసి) అనుగ్రహించడం, ఆ తత్త్వమే లక్ష్మి. లోకం అన్నా వీక్షించబడేది అని అర్థం. అందుకే అమర కోశ కారుడు లక్ష్మీ దేవిని లోక మాత అన్నాడు.


2వ భాగం 

---------------

కమలా కుచ చూచుక కుంకుమతో 

నియతారుణితాతుల నీల తనో 

కమలాయత లోచన లోకపతే 

విజయీభవ వేంకట శైలపతే

అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం. 

ఇంతకు ముందు భాగంలో నీల తనువు అంటే ఏమిటో చూసాం. కమలాయత లోచన లోకపతే అంటే ఏమిటో చూసాం. భగవంతుడి హృదయం అంటే, ఆయన దయకు సూచకం అనీ, పెద్ద కళ్ళతో వీక్షించడం అంటే, ఆ దయతో సర్వలోకాలనూ చూడటం అనీ కిందటి భాగంలో ప్రస్తావించబడింది. జగన్మాత అంటే కృప మాతృ లక్షణం కాబట్టి, ఒక ఇంట్లో లాగ, జగత్తుకి మాతా పితా ఉన్నారు అనుకుంటే, భద్రతా భావం కలుగుతుంది కాబట్టి వైదిక సంప్రదాయంలో ఇలా భావిస్తారు అని కూడా చెప్పబడింది. 

అసలు భగవంతుడికి దయ ఉండాలా? లేక పోతే వచ్చిన నష్టం ఏమిటి? ఆయన గొప్పతనం ఏమైనా తగ్గుతుందా? అని అడగవచ్చు. 

ఆయన దయామయుడు అనుకోవడం వల్ల ఒక విధమైన సాంత్వన కలుగుతుంది.  అలా కాకుండా ఏదో మెకానికల్ గా కర్మ సాక్షి అనో, ఇంకొకటి అనో అనుకుంటే ఆ confidence  రాదు. దీనికి వేదం, శ్రద్ధయా దేవో దేవత్వం అశ్నుతే అని చెప్పింది. అసలు దేవుడి దేవత్వమే ఆయనకి మనపట్ల ఉన్న శ్రద్ధవల్ల అట.

అంతా బాగానే ఉంది. మధ్యలో ఈ స్తనాలు ఏమిటి? స్తనాగ్రాలు ఏమిటి?

శ్లోక రచయిత సంస్కృతంలో తమిళంలో మహా పండితులు. వారు వేదాంత దేశికుల వద్ద, వరవర మునీంద్రుల వద్ద అధ్యాత్మ విద్యను అధ్యయనం చేశారు. అన్నమయ్యను అర్థం చేసుకోవాలి అన్నా వారి సంప్రదాయంలోని ఈ సుప్రభాత కర్త అయిన అణ్ణన్ స్వామి వంటి వారిని అర్థం చేసుకోవాలి అన్నా ప్రాచీన తమిళ భక్తి సాహిత్యంతో, ముఖ్యంగా ఆళ్వార్ల దివ్య ప్రబంధంతో పరిచయం ఉండాలి. 

ఆళ్వార్ల కవిత్వంలో స్త్రీ స్తనాలు మనం మన పతి అయిన  భగవంతుడికే చెంది ఉండటం (భగవదేక శేషత్వం) అనే దానికి ప్రతీక. వీటిని ఒక కండలు తిరిగిన మగవాడికి, ఒక చీమకు, ఒక బండరాయికి, మొత్తం జగత్తుకు చెప్పవచ్చు. అపుడు మూర్తీభవించిన ఆయన దయాగుణమే అయిన అమ్మవారికి చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 

మరి చూచుక అని (స్తనాగ్రం) అని కూడా ఎందుకు రాశారు?

ముందు కుంకుమతః అన్న దానిని చూద్దాం. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. పైన చెప్పబడ్డ సాహిత్యంలో ఎరుపు వాత్సల్యానికి చిహ్నం. వాత్సల్యం అంటే ఆవు తన లేగదూడని నాకే అంత అభిమానం భగవంతుడికి మనయందు ఉంటుంది. 

దయ, వాత్సల్యం ఇవి అన్నీ ఒకే విధమైన గుణాలు. కాబట్టి అతిశయించిన కరుణతో ఆయన మనల్ని తల్లిలాగ ప్రేమిస్తూ, మనం అంటే వాత్సల్యం కలిగి ఉంటాడు. 

కాబట్టి కమలాదేవి దయ, కృప, శ్రద్ధ ఇలాంటివి సూచిస్తే, ఆయనకే చెందిన ఆయన దయాగుణం అతిశయించి, ఆయన మనల్ని పుత్రవాత్సల్యంతో ఆవు తన దూడ మలిన భూయిష్టమైన శరీరాన్ని అత్యంత ప్రీతితో ఇష్టపడినట్టుగా, దగ్గరకు తీసుకుంటాడు. 

ఈవిధంగా కమల-దయ,  కుచాలు - ఆవిడ భగవంతుడి అధీనంలో ఉండటం. కుచ చూచుకం - భగవంతుడికి మనపై దయ తారాస్థాయికి వెళ్లడం. కుంకుమ - వాత్సల్యం (ఎరుపురంగు కారణంగా). 

ఇందుచేత ఆయన నీలమేఘం వంటి శరీరం ఎర్రగా మారిందిట! ఇవీ ఇందులో ఉన్న సంకేతార్థాలు. 

అందుకే ఈ ఫోటో పెట్టడం జరిగింది. ఈ ఫొటోలో ఎంత శృంగారం ఉందో, అంతే శృంగారం ఈ శ్లోకంలో కూడా ఉంది!

ప్రశ్నలు - సమాధానాలు:

---------------------------------

1. శృంగారాన్ని శృంగారంగా చూడాలి. ఇలా మార్చెయ్యడం ఏమిటి?

ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడటం నేర్చుకోండి. ఒకాయన నేను ఒక అన్నమయ్య కీర్తనకు ఇదే రకంగా  అర్థం చెపితే ఏడుపు సింబల్ పెట్టాడు, పైగా రచయితట.  కవిత్వం తెలిసిన వారు నిజానికి మనకు చెప్పాలి, poetic symbolism అనేది ఒకటి ఉంటుంది అని. 

నేను చెప్పిన సంకేతార్థాలు ఈ శ్లోక రచయిత సంప్రదాయంలో చాలా మందికి తెలిసినవే. 

దేవుడు తన కృపతో రక్షించును, ఆయనను స్తుతింపుడి అంటే అది కవిత్వం కాదు, అదేదో ప్రార్థన అవుతుంది.

2. ఇక్కడ జగత్తుకి తల్లిదండ్రుల మధ్యనే కదా చెప్పబడింది. భార్యాభర్తల మధ్య ధర్మబద్ధం అయిన శృంగారం లేకపోతే ముఖ్యంగా ఈ ప్రపంచానికి తల్లిదండ్రుల మధ్య, అసలు ఈ సృష్టి ఉంటుందా అండి?

శ్రీరామాయణంలో బ్రహ్మ "అహం తే హృదయం రామ" అని భగవంతుడితో అంటాడు. అంటే, విష్ణువు హృదయమే బ్రహ్మ. ఆయన ఎపుడు ఎలా సంకల్పిస్తే అపుడే అలాగే సృష్టి అని అర్థం. ఇంక ఈ ప్రశ్న మరీ చిన్న పిల్లల ప్రశ్నలా ఉంది. త్రిమతాలకు చెందిన మేధావులం అనుకునే వారు అడగదగ్గది కాదు. కొంచెం ఆలోచించండి. అదేదో తంత్ర శాస్త్ర గ్రంథం (నాకు ఎలా తెలుసు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 90ల్లో ఇలాంటి భావజాల వ్యాప్తి కోసం వార పత్రికల్లో కూడా వేసే వారు) చెప్పినట్టుగా దేవీ దేవుల (శ్రీవారు, అమ్మవారు కాదు) ప్రణయం వల్ల ఈ ప్రపంచం సంభవించలేదు, శ్లోక కర్త సంప్రదాయం ప్రకారం.

3. మరి అన్యమతస్థులు, నాస్తికులు ప్రశ్నిస్తే?

పైన నేను చెప్పినది అయితే శ్లోక కర్త అధ్యయనం చేసిన సాహిత్యం ప్రకారం. లేదూ మీకు తెలిసిన పద్ధతిలో సమాధానం ఇవ్వండి. గౌరవ ప్రదమైన చర్చ ఓకే. ఎదుటి వారు దూషిస్తే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి.

4. మరి శృంగార పరమైన సాహిత్యం ఆధ్యాత్మికతలో నిషేధమా?

అద్వైతులు జీవ బ్రహ్మల ఐక్యానికీ, విశిష్టాద్వైతులు జీవుడూ బ్రహ్మా (అంటే పరబ్రహ్మం) కలిసి ఆనందించడానికీ  సంకేతార్థంగా భాగవత శ్లోకాలనీ, రెండవ వారు అయితే తమిళ పాశురాలనీ ఇంకా భాగవతం మొదలైన పురాణ శ్లోకాలనీ , ఉపయోగిస్తారు. అలాగే చాలా అన్నమయ్య కీర్తనలు కూడా ఇదే కోవకు వస్తాయి. ఈ శృంగారంలో ప్రతీకలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే కాల పరిమితి ఉన్నదానికంటే అనంతంగా ఉండేది చాలా గొప్పది కదా? నిజానికి ఇది  అర్థం చేసుకున్న వారికి చాలా మంచి ఆలోచనలు కలిగి కామ క్రోధాలు తగ్గుతాయి.