Wednesday, 1 April 2020

Swear on You and Her!

In Annamayya's songs expressing love for the Supreme Lord as the intimate lover of the individual self, the Lord is the hero and the individual self or AtmA is the heroine. In this song, the heroine is a tribal woman who says that she longs for none other than Him and it is appropriate for Him to join her rather than she getting branded as someone in love with Him and longing for Him desperately.

The below song is in line with nammazhwAr's ThiruvAimozhi verse 10.10.2 where he swears on the Lord and His consort Sridevi (thiruvANai ninANai kaNdAy..)

Pallavi:
Stay there, stay there
I swear on You!
Won't my folks
Laugh at me for being your lover
By which You come so near?

॥పల్లవి॥ నిలు నిలు దగ్గరకు నీ యాన నీకు
వలచితినని మావారెల్ల నగరా

Inner meaning:
The heroine or the devotee is not seeking any credit for oneself for being His lover. As per the conviction of Sri Annamacharya and Azhwars, it is the Lord Who comes to the individual self without any expectation from the latter.


CharaNam 1:
Don't want don't want
Pearl-studded necklaces
For us who live in the hills
When I feel shy to see myself in the mirror
Will not my folks
Who are too smart
Laugh at You for Your present?


Inner meaning:
The kin of the tribal woman are great devotees or bhAgavatOttamas as in case of many other songs of Annamacharya. They long for none other than the Supreme Being and live in His thoughts. Hills stand for His abode the seven hills. Will they not laugh at You if You present me a few necklaces instead of presenting Yourself to me?

॥చ1॥ వద్దు వద్దు కొండలలోవారికి మాకింతేసి
పెద్దపెద్ద ముత్యాలుపేరులిన్నేసి
అద్దము చూచిదె నాకు నంతకంటె సిగ్గయ్యీని
గద్దరి మాచెంచువారు గని నిన్ను నగరా

Charanam 2:
Enough of gold chains and gold rings
And enough of necklages studded with blue sapphires
Keep them with You
We are the ones who stay in a corner
If I display all these jewels
Will my folks not laugh at me?

Inner meaning:
Staying in a corner means staying at His feet. Keep the ornaments with You means acknowledging that He is the sole owner of everything.

॥చ2॥ చాలుఁజాలు బంగారు సరుపణు లుంగరాలు
నీలపుఁగంట సరులు నీకే వుండనీ
మూలనుండేవారు గాక ముత్యాలచెరఁగుల-
చేలగట్టుకొన్న నన్ను చెంచెతలు నగరా

Charanam 3:
Don't come, don't come!
I swear on Your consorts.
What has so excelled
Between You and I?
With great zeal
You came and joined me
Will the people who see this
Not smile?

Inner meaning:
When the heroine says "don't come" it means "you come"! Swearing on His consorts means swearing on Sridevi Who stands for His grace or krupA, and Bhudevi the presiding deity of earth Who stands for His forgiveness or kshamA. His consorts also means the other devotees who were blessed to unite with Him. Lord's coming and joining the individual self is a cause of joy for the well-wishers of the heroine.

॥చ3॥ రాకురాకు యీడకు నీ రమణుల పాదమాన
నాకు నీకు నింతేసి ననుపేఁటికి
దీకొని కూడితి నన్ను తిరువేంకటేశ యీ-
కాకరిచేఁతలకు లోకమువారు నగరా

Click here for an audio link (please listen from 13.35 onward).

Music Composed by: Dr. Josyabhatla Rajasekhara Sarma
Sung by: Chandana Bala Kalyan
Raaga: Athana


Wednesday, 19 February 2020

Serving His devotees superior to serving Him

ఉన్నమాట లిక నేల వో దేవా
యెన్నటి కిదేమాట యింకా నింకాను                   // పల్లవి //

వివరణ:

శ్రీ విష్ణు సహస్రనామంలో విజితాత్మా విధేయాత్మా అన్నట్లుగా పరమాత్మ తన భక్తులకి తానే విధేయుడు. భగవదనుగ్రహంతో భగవంతుడిని ఆశ్రయించినవారు కర్మపాశానికి బద్ధులు కారు. దీనినే శరణాగతి అంటారు. 

భగవంతుడిని ఆశ్రయించడం కన్నా భాగవతులని ఆశ్రయించడం ఉత్తమమైనది. అలా భాగవతులని ఆశ్రయించినవారు ఎన్నటికీ చెడరు. వేరే ఎన్నో మాటలెందుకు? నన్ను నీ దాసుల దాసుడిగా ఎప్పటికీ పరిగణించి ఏలుకో అంటున్నారు అన్నమయ్య. 

చరణం 1:


కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము
యింతలో రెండు గలవా యేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను
చెంతఁ గాచుట నీపని సేవసేయ నాపని         // ఉన్న //

వివరణ:

నా పుణ్యపాప ఫలాల వల్ల భవబంధాల్లో కొంత ఇరుక్కున్నాను అంటారు. నీ రక్షకత్వం వల్ల నీకు కొంత దగ్గరవుతున్నాను. నిజంగా నువ్వు రక్షకుడివైతే నేను కర్మబంధాల్లో ఇరుక్కుంటానా?  సర్వాంతర్యామిగా నీవు నన్ను ఆడిస్తున్నావు. నేను నీ చేతిలో ఆడే బొమ్మనే తప్ప నాకు స్వాతంత్య్రం ఏమీ లేదు. నన్ను రక్షించే బాధ్యత నీదే. నీ దాసులకు సేవ చెయ్యడం నాకు సహజమైన విధి. "అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను" అనడం  "ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశే అర్జున! తిష్ఠతి, భ్రామయన్ సర్వ  భూతాని యంత్రారూఢాని మాయయా" అన్న గీతా శ్లోకం యొక్క సారాంశం. 

చరణం 2:


నే నపరాధి నయ్యేది నీవు వహించు కొనేది
యీ నెపాలు రెండూ నేల యేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు     // ఉన్న //

వివరణ:

నేను అపరాధ చక్రవర్తిననీ నీవు దయతో నన్ను రక్షించే భారాన్ని వహిస్తావు అనీ అంటారు. ఈ రెండూ ఎందుకు? నీ చేత రక్షించబడితే నేను అపరాధాలు ఎందుకు చేస్తాను? ఇలా అయితే నీకు అపకీర్తి రాదా? దీనికి ముగింపు పలకకపోతే ఇంక నీ మహిమ ఎలా తెలుస్తుంది?  అని చింతిస్తున్నారు అన్నమయ్య. 

చరణం 3:


మెదలే నా యధమము మీ ఘనత యెంచి కావు
యిదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యిఁకను    // ఉన్న //

వివరణ:

ఇకముందు నేను అనేక పక్కదోవలు పట్టే ముందే నా అధమ స్థితినీ మీ - అంటే నీ యొక్క ఇంకా నీ దేవేరి జగన్మాత యొక్క ఘనతనీ గుర్తుపెట్టుకొని మీ బాధ్యతగా నన్ను రక్షించు. ఓ శ్రీవేంకటేశా! అన్ని విధాలా కూడా నేను నీ దాసులకు దాసుడిని. వారికి దాస్యం చెయ్యడానికి నాకు అడ్డంకులైన నా గత అపరాధాల్ని లెక్కించకు అని ప్రార్థిస్తున్నారు అన్నమయ్య. అన్ని చోట్లా నీవు అని, ఇక్కడ మీరు అనడంలో  జగత్తుకి తల్లిదండ్రులైన లక్ష్మీ నారాయణులిద్దరినీ వేడుకోవడం తెలుస్తోంది. భాగవతోత్తములు కరుణించి తమవాడు అనుకున్న వాడిని వారికి విధేయుడైన స్వామి ఇక రక్షించక తప్పదు కదా!

Click here for a link to audio by Smt Sravani Ganti

Sunday, 2 February 2020

Lord riding the Sun

*సూర్యప్రభ సంకీర్తనం*

॥పల్లవి॥విపరీతము లివి వినరాదు
వుపమలెల్ల మీవొద్దనె కలిగె
॥చ1॥వువిదవదనచంద్రోదయవేళను
రవియగుసూర్యప్రభ నీవేగగ
యివల నవల మీయిద్దరివలననే
దినమును రాతిరి దెలియగ గలిగె
॥చ2॥అంగనతురుముమహిర్షి శివేళను
రంగగు సూర్యప్రభ నీవేగగ
సంగడి వెలుఁగును సరి జీకటియును
చెంగట మీయందే చెప్పగ గలిగె
॥చ3॥కాంతమోవి చుక్కల నిండువేళ
రంతుల సూర్యప్రభ నీవేగగ
యింతట శ్రీవేంకటేశ్వర మీయందే
కాంతులు గళలును గలయుట గలిగె
-----(తాళ్లపాక అన్నమాచార్య)
-----(రాగము: నాగ గాంధారి,రేకు: 1433-5,సంపుటము: 24-197)

Ragam: kadanakutuhalam(కదనకుతూహలం)
Composed& sung by Smt.Vandana garu
Click here for a link to the audio.


ఉపోద్ఘాతం:
పురుష సూక్తంలో ఈ క్రింది మంత్రం ఉంది.  
హ్రీశ్చ తే లక్ష్మీశ్చపత్న్యౌ అహో రాత్రే  పార్శ్వే 
నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం

పురుషోత్తముడికి హ్రీ మరియు లక్ష్మీ దేవి భార్యలు. దినం రాత్రి రెండు పార్శ్వాలు. నక్షత్రాలు రూపం. అశ్వినీ దేవతలు బాగా తెరుచుకొన్న నోరు. 

ఇందులో చాలా మటుకు ఈ కీర్తనలో వివరించబడింది. 

పల్లవి:
అతిశయించిన మీ మహిమలని వినడానికి మా చెవులు సరిపోవు. అత్యుత్తమమైన ఉపమానాలన్నీ మీ ఇద్దరి విషయంలో మాత్రమే చెప్పబడుతాయి.

ఈ మధ్యనే మనం చూసిన "ఆచార విచారముల నేనెరుగ" కీర్తనలో "వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీత విజ్ఞాన విధులేమి నెరఁగ" అనడం గమనించదగ్గది. 

చరణం 1:
అమ్మవారు అనే చంద్రవదన ముఖోదయానికి కావలసిన సూర్యప్రభవు నీవే! సూర్యుడి లాగ చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు. అలాగే జగన్మాత శ్రీహరిపై ఆధారపడి ఉన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. మీ ఇద్దరి వలననే పగలు రాతిరి అని చెప్పడం వల్ల స్వామికి అమ్మవారితో నిత్యయోగం చెప్పబడింది. అలా కాదు, ఇద్దరూ వేరు  అనుకున్నవాళ్ళు  శూర్పణఖా ఆమె అన్న వెఱ్ఱి రావణుడూ!

రాత్రి చంద్రుడు వెలగడాన్ని ప్రస్తావించడం  అజ్ఞానంలో ఉన్నవారిపైన కూడా స్వామి కృప ప్రసరిస్తుందనే ధైర్యాన్ని ఇస్తుంది.

చరణం 2:
తురుము అంటే కొప్పు జ్ఞానానికి సంకేతం. అంగన స్వామి వారి అంగన లోకమాత, భగవత్ కృప! అంతర్జాలంలో వెదికితే "మహిర్షిశి" మహా నిశి ఏమో అని ఒకరిద్దరు అన్నారు. లేదా మహర్నిశి కూడా కావచ్చు. నిశి అంటే రాత్రి. భగవంతుడు అనే సూర్యుడి కృప చేతనే జ్ఞానోదయం అవుతుంది అని అంతరార్థం.

శిశిరం అనే అర్థం వచ్చేటట్టు ఎవరైనా పరిష్కరించినా తప్పులేదు.

ఈ విధంగా అహో రాత్రే పార్శ్వే  అన్నది మొదటి రెండు చరణాల్లో చెప్పబడింది. 

చరణం 3:
శ్రీవిష్ణు పురాణంలో  ఆది మధ్యాంత రహిత క్షీర సాగరంలో ఆవిర్భవించినపుడు ఇంద్రుడు ఇలా అంటాడు.

త్వం మాతా సర్వలోకానాం దేవ దేవో హరిః పితా
త్వయైతత్ విష్ణునా చాంబ! జగద్వ్యాప్తం చరాచరం.

నీవు అన్ని లోకాలకూ తల్లివి. దేవదేవుడు శ్రీహరి తండ్రి. ఓ జగదంబా! మీ ఇరువురి చేత ఈ చరాచర జగత్తు వ్యాపించబడి ఉంది.

ఇక్కడ చెప్పినట్టుగా , పైగా పురుషసూక్తంలో నక్షత్రాణి రూపం అని చెప్పినట్టుగా, అమ్మవారి నోటిలో నక్షత్రాలు అన్నీ నిండి ఉన్నాయిట! ఇంకా మోవి, నక్షత్రాలు అన్నీ నిండి ఉన్న మోవి అని చెప్పడం వల్ల వ్యాత్తం (బాగా తెరచిన నోరు) అన్నది కూడా వచ్చేసింది. అశ్వినీ దేవతలు కూడా నక్షత్రాలే కదా!

"యింతట శ్రీవేంకటేశ్వర మీయందే కాంతులు గళలును గలయుట గలిగె" అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు (self -explanatory)





Monday, 30 December 2019

Essence of Bhagavad Gita


ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా




వివరణ:
ఉపనిషత్తుల సారమైన భగవద్గీత అత్యంత విజ్ఞాన దాయకమైనది. భగవంతుడే జీవుడి ఉనికికి ఆధారం అనీ, పోషకుడు, రక్షకుడు ఆయనే అని, ఆయనను స్మరించడం, విస్మరించడం ఆయన సంకల్పం వల్లనే అనీ స్వామి స్వయంగా అర్జునుడికి భగవద్గీతలో ఆనతిచ్చిన వైనాన్ని అన్నమయ్య మనకు ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నారు. వివేకంతో ఆయనని భజించమని బోధిస్తున్నారు.

చ : భూమిలోను చొచ్చిసర్వ భూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడనేను

గీతలో  పురుషోత్తమ ప్రాప్తి యోగం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా 
పుష్ణామి చౌషధీస్సర్వాః  సోమో భూత్వా రసాత్మకః 

నేను భూమిలో ప్రవేశించి సమస్త భూతాలనీ నా శక్తితో ధరిస్తాను. చంద్రుడి రూపంలో  పంటలన్నీ వృద్ధి చెందేలా  వాటికి తగిన తేమను కల్పిస్తాను. 

ఇక్కడ అన్నమయ్య ఓషధి అంటే మొక్క అనే అర్థాన్ని ఉపయోగించారు. భూమి మీద మొలిచే ప్రతి మొక్కా ప్రాణులకి ఉపయోగపడుతుంది. రసాత్మకః అన్న దానికి తేమలను కలిగించే వాడు అని అర్థం చెప్పారు. చంద్రుడు లేని వాతావరణంలో జీవరాశిని భూమిపై ఊహించలేము. 

కామించి అంటే సంకల్పించి అని అర్థం. పంటల్ని పండించడమే కాదు, ప్రారంభం నుంచి కూడా కలిగించేది ఆయనే కదా. అందుకే కలిగించి అన్నారు. 

చ : దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తేపుల నఱగించేటి దేవుడనేను
ఏపున ఇందరిలోని హృదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడనేను

గీతలో  తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం. 

నేను జఠరాగ్ని రూపంలో జీవుల శరీరంలో ఉండి ప్రాణ వాయువు సరిగా కలిగేలా, తేనుపులు సరిగా వచ్చేలా ఏర్పరుస్తాను . తద్వారా నాలుగు విధాలైన  అంటే పళ్ళు, పెదాలు, నాలుకని మూడు విధాలుగా  ఉపయోగించి తినేది , ఇంకా ద్రవరూపమై తాగబడేది (ఖాద్య చోష్య లేహ్య పేయ రూపకమైన ఆహారం)అయిన ఆహారం జీర్ణమయ్యేలా చూస్తాను. ఈ శ్లోకంలో పరమాత్మ ఆయుర్వేద విశేషాన్ని బోధిస్తున్నాడు. 

ఆ పై శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు:

సర్వస్య చాహం హృది సన్నివిష్టో 
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ 
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః 
వేదాంతకృత్ వేదవిదేవ చాహం. 

అందరి హృదయాల్లోనూ నేను చక్కగా ప్రవేశించి ఉంటాను. నా వలనే జ్ఞానం, తలపు, మరపు ఏర్పడతాయి. ఇక్కడ తమస్సుని పోగొట్టే జ్ఞానాన్ని అన్నమయ్య దీపించుట  అన్నారు. 


 చ : వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆదినే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను

రెండవ చరణంలో అన్నమయ్య ఉదహరించిన  శ్లోకంలో స్వామి ఇంకా ఇలా చెపుతున్నాడు:

వేదాలన్నిటి చేత తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతాన్ని ప్రసాదించినదీ, వేదం పూర్తిగా తెలిసినదీ నేనే. ఇక్కడ వేదం అంటే జ్ఞానం. స్వామి సర్వజ్ఞుడు.

ఇక్కడ వేదాంతవేత్తలచే అని చెప్పడం ద్వారా జ్ఞానులైన గురువులచే జగత్తుకి, వేదాలకు ఆదిగా తెలుసుకోదగిన వాడు స్వామి అని అన్నమయ్య భావం. దీనిని "తద్విద్ధి ప్రణిపాతేన" అనే జ్ఞానయోగంలోని గీతా శ్లోకంతో కలిపి అర్థం చేసుకోవాలి.

భగవద్గీత మోక్ష సన్న్యాస యోగంలో స్వామి ఇలా చెపుతారు:

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

అన్ని ధర్మాలని పక్కన పెట్టి  సర్వేశ్వరుడినైన నన్ను మాత్రమే నన్ను పొందటానికి ఉపాయంగా స్వీకరించు. నిన్ను అన్ని ప్రతిబంధకాలనుండీ నేను విముక్తుణ్ణి చేస్తాను. బాధ పడవద్దు.



దీనికి అన్నమయ్య "శ్రీదేవితో గూడి శ్రీవేంకటాద్రిమీద పాదైన దేవుడను" అని చెప్పారు.  సంస్కృతంలో శ్రయణాన్ని సూచించే శ్రీ  శబ్దం భగవంతుడు మనకు శరణు ప్రసాదించడాన్ని సూచిస్తుంది.  వేంకటమ్ అనే సంస్కృత పదం వేంగడం అనే ద్రావిడ పదంనుంచి వచ్చింది. వేం అంటే వేడి, కడంగళ్ అంటే కష్టాలు. భగవత్ ప్రాప్తికి కలిగే ఆటంకాలు అన్నీ భగవదనుగ్రహంతో మాడి మసైపోతాయి అని వేంకటమ్ అనే పదం తెలుపుతుంది. ఇలా అన్నమయ్య చరమ శ్లోకంగా చెప్పబడే ఈ శ్లోకాన్ని శ్రీ శ్రీనివాసుల పరంగా సరిగ్గా చెప్పారు.

పాదైన అన్నమాట ఈ విషయంలో స్వామికి స్థిరత్వాన్ని సూచిస్తోంది.

ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయా దిశతే శ్రీమద్ వేంకటేశాయ మంగళం|

Audio courtesy by Smt Sravani Ganti



Saturday, 28 December 2019

Lord's grace showering on us

మచ్చికతో నేలవయ్య మదనసామ్రాజ్యలక్ష్మి
పచ్చి సింగారాలచేత బండారాలు నిండెను
॥పల్లవి॥
కొమరెతురుమునను గొప్పమేఘ ముదయించి
చెమటవాన గురిసెఁ జెక్కులవెంట
అమరఁ బులకలపైరు లంతటానుఁ జెలువొంది
ప్రమదాలవలపులపంట లివె పండెను
॥॥
మించులచూపుల తీగెమెఱుఁగు లిట్టె మెరిచి
అంచెఁ గోరికలజళ్లవె పట్టెను
సంచితపుకుచముల జవ్వనరాసులు మించె
పొంచి నవ్వుల మాని పోదిగొనె నిదిగో
॥॥
అలమేలుమంగమోవియమృతము కారుకమ్మి
నలువంక మోహపుసోనలు ముంచెను
యెలిమి శ్రీవేంకటేశ ఇంతి నెట్టె కూడితివి
కొలఁదిమీరి రతులకొటార్లు గూడెను

వివరణ:పల్లవి:

జీవేశ్వరుల సంయోగాన్ని, శ్రీమన్నారాయణుడి కృపనీ, ఈ కీర్తన తెలియచేస్తుంది. ఒకే కీర్తనలో జీవుడిని ఆయన ప్రియురాలిగా, ఆయన పట్టమహిషి జగదీశ్వరిని ఆయన కృపగా తెలపడం ఈ కీర్తన ప్రత్యేకత. 


మచ్చికతో ఏలవయ్య అంటే జీవుడిని అభిముఖుడిని చేసుకొని ఏలుకొమ్మని అర్థం. ఇద్దరూ అభిముఖులైతేనే కదా సంయోగం రక్తి కట్టేది! మద్ అనే ధాతువుని తృప్తి, హర్షం అనే అర్థంలో వాడతారు. కాబట్టి మదన సామ్రాజ్య లక్ష్మి అంటే జీవుడి బ్రహ్మానుభూతి అనే సంపద.

ఇంక "పచ్చి సింగారాల చేత బండారాలు నిండెను" అన్నదానికి అర్థం రెండవ చరణం రెండవ భాగంలో దొరుకుతుంది.

చరణం 1:

కొమెర (జీవుడు - ఈ పాటలో నాయిక) తురుములో అంటే జడలో గొప్ప మేఘం ఉదయించింది.  గొప్ప మేఘం అంటే నీల మేఘ శ్యాముడైన స్వామి. ఆయన దయని అందరిమీదా తారతమ్యం లేకుండా వర్షిస్తాడు కాబట్టి ఈ ఉపమానం చెపుతారు. 
జడలో స్వామి ఉదయించడం ఏమిటి? కేశాలు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానోదయం కాగానే ఆయన దయ వర్షించింది. ఇక్కడ చెమట నాయికదో, స్వామిదో చెప్పలేదు! స్వామిదే అయి ఉంటుంది. ఎలా అని అడక్కండి! అప్పుడే స్వామి దయామృత వర్షి అన్నది ఇక్కడ కుదురుతుంది.  
పులకలు బ్రహ్మానందానుభూతి. 
కృష్ణుడు అంటే భక్తిని కృషి (వ్యవసాయం) చేయువాడు అని అర్థం. అందుకే ఆయన ప్రమదాల వలపు పంట జీవుడిలో పండిస్తాడు!

చరణం 2:
నారాయణ సూక్తం "నీల తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అని అమ్మవారి గురించి చెపుతుంది. పరమాత్మ తన కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలమేఘం లాంటి వాడైతే ఆయనని దర్శింపచేసే మెరుపు తీగ జగన్మాత. ఈ ఉపమానం మనం అన్నమాచార్యుల "ఒకపరికొకపరి వయ్యారమై" కీర్తన ఆఖరి చరణంలో కూడా చూడవచ్చు. 
ఒకసారి మెరుపు మెఱయగానే మేఘం కనిపించింది. వర్షం మొదలైంది. ఇక భగవంతుడిని విరహ తాపంతో కోరుకుంటున్న జీవుడి కోరికలన్నీ జడివానలాగ తీరాయి. లేదూ ఆయనే జీవుడిని ఏరి కోరి అనుభవిస్తున్నాడని కూడా చెప్పవచ్చు. 

కుచములు అన్నమాచార్యుల వారి సంప్రదాయంలో శేషత్వం అనే లక్షణాన్ని సూచిస్తాయి. దీని అర్థం ప్రియురాలు ప్రియుడికి మాత్రమే చెందినట్లు జీవుడు భగవంతుడికి మాత్రమే చెందటం. ఇది జడ పదార్థాలకూ అమ్మవారికీ కూడా వర్తిస్తుంది. 

తాను స్వామికే చెందిన వాడిని అనే భావం జీవుడికి అతిశయించగా, పరమాత్మ యథేచ్ఛగా జీవుడిని బ్రహ్మానందంలో ముంచెత్తుతున్నాడు అని అర్థం. 

చరణం 3:
జీవుడిని అనుగ్రహించమని అనుక్షణం స్వామికి చెప్పేది శ్రీదేవి. ఆవిడ పై చరణంలో మెరుపుతో పోల్చబడింది. ఇక్కడ తన అమృతవాక్కులతో స్వామికి చెప్పగానే ఆశ్రితుడిపై ఆయనకి ఉన్న వ్యామోహం అన్ని వైపులా కమ్ముకొంది. ఇక్కడ మేఘం (స్వామి) ఉరుముతో కూడా అమ్మవారి వాక్కుని పోల్చవచ్చు. అమ్మవారు ఇలా స్వామికి చెప్పడాన్ని అన్నమయ్య సంప్రదాయంలో పురుషకారం (recommendation) అంటారు. 

అంతే, వెంటనే స్వామి జీవుడిని చేరుకొన్నాడు, దానితో జీవుడికీ పరమేశ్వరుడికీ శాశ్వతంగా యోగం కూడింది! 



Sunday, 15 December 2019

Useful links - A good blog on Annamyya songs

Here is one more blogspot with no twisted interpretations and the philosophy in the songs is presented rightly to a great extent.

http://annamacharyulu.blogspot.com/

Tuesday, 10 December 2019

In front of Him in sync and assured of His accepting us

తాళ్లపాక చినతిరుమలాచార్య
రేకు: 12-5 సంపుటము: 10-70

పల్లవి:

సవతులమైనాను సంగతి దప్పదగునా
రవళి వావిలిపాటి రామచంద్రు ముందర ॥పల్లవి॥

వివరణ:

ఇద్దరు భాగవతుల మధ్య సంభాషణ ఇది. జీవులందరు భగవంతుడికి భార్యలే. ఒక్కొక్క సారి బిడ్డలే. ఈ కీర్తనలో భార్యలుగా తీసుకొంటేనే నప్పుతుంది. 

భగవదనుగ్రహం కలిగిన ఒక జీవుడు మరొక జీవుడితో ఇలా అంటున్నాడు. 
మనం ఇద్దరమూ స్వామికి భార్యలమే. స్వామి భక్తులైన మనం సవతులం కదా అని అయన ఎదురుగా సంగతి, స్వరం తప్పవచ్చునా? అంటే పరస్పరం స్నేహభావంతో మెలగాలి అని అర్థం. సహ నౌ భునక్తు అన్నట్టు కలిసి భగవదనుభవం పొందాలి. 

1వ చరణం:


01.నీవనగా నే ననగా నిష్టూరా లేటికే
చేవదేరే మాట లెల్ల చిగిరించీని
మోవరాని దూరు లెల్ల మోపులు గట్టగాను
వేవేగ నిన్నియు మనవిభుడు మోచీనా ॥సవతుల॥

వివరణ:
శ్రీరామాయణంలో స్వామి "సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ" అంటాడు. అంటే "నన్ను  శరణు వేడిన సమస్త జీవులకి అభయాన్ని ఇస్తాను, ఇదే నా వ్రతం" అని చెపుతాడు. 
నిన్ను రక్షిస్తాడు అంటే నిన్ను రక్షిస్తాడు అంటూ అని నిష్ఠురాలు పోవడం దేనికి?  "అభయం సర్వభూతేభ్యో" అని అయన శ్రీరామాయణంలో అన్న మాట నాకు గుర్తుకు వస్తోంది. ఆయన ఏలుకోడు  అని నిందించడం ఎందుకు? దీని అంతటితో వేగిపోతే ఆయన మనల్ని మోస్తాడా?

ఇక్కడ రెండు విషయాలు చూడాలి. స్వామిపై నాయికకు ఉన్న ప్రేమాతిశయం మొదటిది. ఆయన సున్నితమైన మనస్సు ఎంత నొచ్చుకుంటుందో మనం వేసే నిందలు ఆయనకి ఎంత భారం అవుతాయో అని నాయిక భయం. రెండవది ఆయన తప్పక మోస్తాడు అన్న మహా విశ్వాసం.  ఈ రెండవ భావం మన భారం అంతా స్వామిదే అనే నిబ్బరాన్ని ఇస్తుంది. 
2వ చరణం:
02.కాదనగా నౌననగా కరకరేమిటికే
మీద మీద జగడాలు మితిమీరీని
వాదుల యీ సుద్దు లెల్ల వాములు వెట్టెగాను
కాదని మనవిభుడు గాదెల బోసీనా ॥సవతుల॥

వివరణ:
నీకు మాపై ప్రేమ ఉందనీ, కాదు, లేదనీ ఆయనపై మన ఈ కరకర కొరకరలు దేనికి ?  రోజు రోజుకి మనకి ఆయనతో గొడవలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఈ వాదులాటలు అన్నీ మోపులకొద్దీ అయితే కాదని మన స్వామి వాటిని ఏమైనా గాదెలో పడేసి ఉంచుతాడా? కాదు, తప్పక మనల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు అని భావం.

3వ చరణం:
03.రమ్మనగ పొమ్మనగ రారాపు లేటికే
దొమ్మి రేగి కాకలు తోదోపు లాడీని
నమ్మించి శ్రీవెంకటనాథుడు నిన్ను నన్నును
సమ్మతిగాగూడగాను సతము లై తిమిగా. ॥సవతుల॥

వివరణ:
స్వామితో రమ్మనీ పొమ్మనీ ఈ కఠినమైన ఘర్షణలు దేనికి? విరహ తాపంతో మనం ఇద్దరం స్వామిని కలవడానికి ఒకరు అంటే ఒకరు అని ఉన్నాం. ఎలాగో నమ్మించి ఆయన మనల్ని తన సమ్మతితో కూడడంతో మనకి ఒక అర్థవంతమైన అస్తిత్వం (సత్త) వచ్చింది కదా!