Saturday 24 September 2022

Entha Matramuna Evvaru Talachina

 అన్నమాచార్య కీర్తన: ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన

పాడిన వారు: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
స్వరకర్త: కడయనల్లూర్ వెంకటరామన్ (ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మొదట పాడినప్పుడు)
రాగం: బృందావని+మాయా మాళవ గౌళ రాగం
క్లుప్త వివరణ:
ఈ పాట అర్థం చేసుకోవడానికి చాలా మటుకు సులభంగానే ఉంది. అయితే ఒకటి రెండు సందేహాలు రావచ్చు.
  1. మొదటి చరణంలో విష్ణువును మొదట ప్రస్తావించి తర్వాత పరబ్రహ్మాన్ని ఎందుకు చెప్పారు అని.
  2. పిండంతే నిప్పటి అంటే ఏమిటి? నిప్పటి ఒక రాయలసీమ వంటకం. మరి వివిధ దైవాల గురించి, సామరస్యం గురించి చెపుతో పిండి కొద్దీ వంటకం అని ఎందుకు అంటున్నారు? ఈ సందేహం కూడా కలుగవచ్చు.
వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనను విష్ణువు అన్నాయి. విష్ణువు అనగానే వేదాల ప్రకారం త్రివిక్రముడు, ఇంకా పురాణేతిహాసాల ప్రకారం నరసింహుడు, రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు ధరించి అందరిలో కలసి ఒకడిగా తిరగడం, ఆయన మహత్తుని మనకు తెలియచేయడం, మనకు తాను ఉన్నాను అనే ఆశ్వాసనని ఇవ్వడం, ప్రేమ, దయ, వాత్సల్యం వగైరా వస్తాయి. ఎక్కడి వరకూ అంటే శ్రీవేంకటేశ్వరుడు మొదలైన రూపాల్లో ఆలయంలో మనల్ని అనుగ్రహించే దాకా!
అయితే వేదాల శిరోభాగమైన ఉపనిషత్తులు పరబ్రహ్మం అని, బ్రహ్మం అనీ తరచూ అంటూ ఉంటాయి. దీనిని అధ్యయనం చేసినవారు వారు భాగవతోత్తములు కావచ్చు, కాకపోవచ్చు, అపుడు వివిధ రకాలుగా భావించే అవకాశం ఉంది. అంతే కాకుండా పైన చెప్పిన గుణాలు అన్నీ పరబ్రహ్మం అన్నంత మాత్రాన ప్రకాశించవు. పరబ్రహ్మం అనే మాట ఆయన ఔన్నత్యాన్ని మాత్రమే చెపుతుంది. అందుకే మొదట విష్ణువు పేరు చెప్పారు.
ఇంక ఆఖరులో నీ వలన కొరతే లేదు, నీరు కొలది తామరవు అని చెప్పారు. పైగా గంగలోనూ, బావుల్లోనూ ఒకే జలం ఊరినట్టుగా దైవం ఒకటే అని చెప్పారు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆయన ఒకే దేవుడి గురించి చెప్పారు!
విష్ణువు అన్నప్పుడు ఒక వర్గానికి చెందిన దైవంగా కాకుండా సర్వవ్యాపి అయిన పరిపూర్ణ దైవంగా తీసుకోవాలి. ఇంక పరబ్రహ్మం అంటే ఆయన ఔన్నత్యాన్ని సూచించే పదమే! శివుడు పరమాత్మ సంహార మూర్తి. భైరవుడు ఆ శివుడి అంశమే. శక్తి పరమాత్మ మాయయే.
ఇలా భగవంతుడి కంటే వేరైన విషయాల్ని అసలు అన్నమయ్య ప్రస్తావించనే లేదు. అందుకే భగవంతుడిని అన్ని చోట్ల ఉన్న ఒకే జలంతో పోల్చారు.
దైవాలని భౌతికంగా ఊహించుకున్న వారే విష్ణువనీ, శివుడనీ, శక్తి అనీ, కాదు ఇద్దరో ముగ్గురో ఒకటే అనీ, దెబ్బలాడుకుంటుంటారు. వీరిలో ఎవరి నమ్మకం వారికి ఉన్న ఉత్తములూ ఎందరో ఉన్నారు.
పల్లవిలో "పిండంతే నిప్పటి అన్నట్టు" అని చెప్పడంలో అంతరార్థం ఇదే!
Brief Description:
-------------------
This song is pretty much easy to understand for those knowing Telugu. However one can have two doubts.
1. Why in the first stanza Vishnu is mentioned first and then Parabrahman?
2. What is "pinDanthE nippaTi" or a dish called "nippaTi" according to the quantum of flour? NippaTi is a Rayalaseema dish. In a song that mentions various deities and talks about harmony, why is it said that dish as per the flour available? This doubt can
also arise.
The Vedas, epics and purANas call Lord Vishnu because he is omnipresent. Vishnu, who is Trivikrama according to the Vedas, according to purANas and itihAsas, takes in the incarnations of Narasimha, Rama, Krishna, etc., mingling with us easily, letting us know His greatness, giving us the assurance that He is there for us, showing love, kindness, affection, and so on.
This goes on to the extent of blessing us in temples in the form of Sri Venkateswara etc.
However, the Upanishads, considered to be the head of the Vedas, often refer to Him as Parabrahman and Brahman. Those who have studied it may or may not be great Bhagavatas, then it is possible that they think differently.
Apart from that, not all of the above qualities shine by saying He is Parabrahman. The word Parabrahman only speaks of his exalted stature. That is why Vishnu's name was mentioned first.
And in the end is is said that there is no shortage because of You, the Supreme Lord and You are like a lotus that grows according to the plentifulness of water. Moreover, it is said that God is the same as the same water in the Ganges and wells. Take a closer look and he says the same God and not different deities!
Vishnu should be taken to be the omnipresent perfect deity rather than a sectarian deity. Parabrahman is the word that signifies His exaltation! Lord Shiva is the divine slayer. Bhairava is an aspect of that Shiva. Shakti is the will or Maya of Vishnu.
Thus Annamayya does not mention anything other than the Supreme Being. That is why God is compared to the same water present everywhere. If you think He is in Ganga, He is in Ganga. If you think He is in a well, He is in a well. As simple as that.
పల్లవి:
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
చరణం 1:
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
చరణం 2:
సరి నమ్ముదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు గరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
చరణం 3:
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణనియెదను, ఇదియే పరతత్వము నాకు
Audio link below:


Sunday 11 September 2022

The divine mother the personification of His grace is the sole refuge for all

 ॥పల్లవి॥ శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

వాసుదేవుఁడా రమణీవశమైయుండఁగను


భగవద్ రామానుజుల వారు అశరణ శరణ్యామ్ అని శరణాగతి గద్యంలో చెప్పినట్టుగా భగవత్కరుణ శ్రీదేవి మాత్రమే జీవులందరికీ దిక్కు. 

శ్రీయతే ఇతి శ్రీ, శ్రయతే ఇతి శ్రీ, అంటే, మనల్ని భగవంతుడికి ఆశ్రయింపచేసేదీ, భగవంతుడిని నిరంతరం ఆశ్రయించి ఉండేదీ, జగన్మాతే. 


శ్రీవాసుదేవ మహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ అని లక్ష్మీ సహస్రనామాల్లో చెప్పినట్టు అమ్మవారు పురుషోత్తముడైన వాసుదేవుడికి కూడా ఈశ్వరి. భగవంతుడు తన కృపకి తానే వశం అయి ఉంటాడు అని అర్థం. ఈ విధంగా అన్నమయ్య కీర్తనల్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. 

క్షీరాబ్ధౌ శ్రీర్యథా జాతా పూర్వం భృగు సుతా సతీ అన్నది శ్రీవిష్ణుపురాణం. పూర్వం భృగుమహర్షి కూతురుగా ఆవిర్భవించిన సతి శ్రీదేవి క్షీరాబ్ధి కన్యకగా వచ్చింది అని అర్థం.  

 సత్తా అంటే అర్థవంతమైన ఉనికి అని అర్థం. భగవంతుడి లాగే శుద్ధసత్త్వరూపిణి అయిన లక్ష్మీదేవిని అందుకే శ్రీసతి అంటారు. 

అదే విధంగా  భర్త జీవితానికి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి భార్యని సామాన్య పరిభాషలో  సతి అని పిలుస్తారు. 


॥చ1॥ సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు

నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను

యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా

కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను


కాకాసురుడికి లోకాలన్నిట్లో ఎవరూ శరణు ఇవ్వకపోతే అపుడు సీతాదేవితో కూడిన రాముడినే ఆశ్రయిస్తే రాముడు రక్షించాడు. 

రావణాసురుడు అహంకారంతో సీత తన అధీనం కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు. ఏమైందో తెలిసినదే. 

॥చ2॥ కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి

అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను

యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా

తుద సభలో వదరి తునకలై పడెను


రుక్మిణీదేవితో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తుండగా అడ్డు వచ్చిన రుక్మిని అమ్మవారు ప్రార్థిస్తే కృష్ణుడు చంపకుండా అతని జుట్టూ గడ్డమూ మీసాలూ ఒకవైపు కోసేసి పరాభివించి వదిలేస్తాడు. 


అదే కృష్ణుడు ఒక్కడూ వెళ్లిన రాజసూయ యాగంలో శిశుపాలుడి నూరవ తప్పుకి అతనిని చంపివేస్తాడు. 


॥చ3॥ సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య

గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను

పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు

గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను

శ్రీదేవి నరసింహ స్వామి తొడపై ఉండగా దైత్య గురు పుత్రులు అంటే హిరణ్యకశిపుడి ఇతర కుమారులూ, ప్రహ్లాదుడి గురువు కుమారులూ, మొదలైన వారు కావచ్చు. వాళ్ళు ప్రహ్లాదుడిని ఎంత హింసించిన వారైనా భగవంతుడు వీరందరూ నిజానికి నా పిల్లలే కదా అని దయతో వదిలేసాడు. 


అదే తాను ఆవిర్భవించినపుడు హిరణ్యకశిపుడిని మాత్రం అప్పటికప్పుడే చీల్చి వధించాడు. 


శూర్పణఖ సీత వద్దు రాముడే కావాలి, ఈమె ఏదో మానవస్త్రీ, నాకు ప్రతిబంధకమైనది అనుకున్నట్టుగా, లక్ష్మీదేవి లేని నారాయణుడు రక్షిస్తాడు, ఆయనే కావాలి, ఈవిడ ఎవరో ఒక దేవత మాత్రమే, అని భేద భావంతో వేరుగా తలిచేవారికి ఈ కీర్తన చక్కని బోధ. 

Click below for a link to an audio visual:





Ksheerabdhi Kanyakaku

అన్నమాచార్య కీర్తన:
*క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని*
*నీరజాలయకును నీరాజనం*

గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం: మధ్యమావతి
రేకు: 1050-1
సంపుటము: 20-295
రేకురాగము: మంగళకౌశిక

పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం

చరణం1:
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణం2:
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

చరణం3:
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం

వివరణ:
సులభంగానే పదాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా రాయట్లేదు.

పల్లవి:
ఇందులో క్షీరాబ్ధి కన్యకకు అంటే అంతకు ముందు అమ్మవారు లేదా అనే సందేహం వస్తుంది. భగవంతుడితో పాటు నిత్యమూ ఉండే ఆయన కృప సృష్టి జరిగాక మొదట భృగు మహర్షి కూతురిగా ఆవిర్భవించింది. దేవతలు కష్టాల్లో ఉన్నపుడు వారిని అనుగ్రహించడం కోసం మళ్ళీ క్షీరసముద్రంలో ఆవిర్భవిస్తుంది.
భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముధధేః పునః
దేవ దానవ యత్నేన ప్రసూతామృత మంథనే|
అని శ్రీవిష్ణుపురాణం చెపుతోంది. భాగవతం కూడా ఇదే చెప్పింది.

లక్ష్మి అంటే అర్థం గతంలో నా పోస్టుల్లో చూసాం. ఒక్క ముక్కలో లోకమాత అని అర్థం చెప్పుకోవచ్చు.

చరణం1:
పద్మాలు మార్దవానికి చిహ్నాలు. నేత్రాలని పోల్చినపుడు సర్వాన్నీ దర్శించే సామర్థ్యాన్ని చెపుతాయి.
జలజాక్షి ముఖం కూడా జలజమే!

కుచాల గురించి గతంలో చెప్పాను. అమ్మవారికి అయినా, ఒక మగవాడికైనా, ఒక జడవస్తువుకి అయినా భగవంతుడికి మాత్రమే చెంది ఉండటం అనే లక్షణాన్ని సూచిస్తాయి. భగవంతుడు భర్త!

కొప్పు జ్ఞానానికి ప్రతీక. ఇంక వరద అభయ హస్తాల గురించి చెప్పక్కర్లేదు.

చరణం2:
పాదపద్మాలు (చరణ కిసలయమ్ములు) శ్రీమన్నారాయణుడి శరణ్యత్వానికి చిహ్నాలు.

అమ్మవారు ఆశరణ శరణ్య అయితే భగవంతుడు అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు (భగవద్ రామానుజులు చెప్పినట్టుగా). శరణు లేని వారికి ఆవిడ శరణం అయితే, ఏమీ ఆలోచించకుండా సమస్త లోకాలకీ ఆయనే శరణు! ఇంక ఇద్దరికీ తేడా ఏమిటి? అందుకే పెద్దలు ఒక ప్రత్యేక దేవతగా కాకుండా మూర్తీభవించిన భగవత్ కృపగా చెపుతారు.

ఊరు అంటే ఆధారం అయినది. రంభ అంటే వెదురు. రంభోరు అంటే వెదురు వంటి బలహీనమైన తొడలు లేదా మోకాలికీ పాదానికీ మధ్య భాగం కలిగినది అని చెప్పవచ్చు. అంటే భగవంతుడే తప్ప వేరే ఆధారం లేనిది ఆయన కృప.

అయ్యవారు కల్పవృక్షం అయితే అమ్మవారు కల్పలత అని శ్రీవిష్ణుపురాణం.

జఘనం అన్నా ఇదే అర్థం వస్తుంది. జఘనం రాగానికి కూడా చిహ్నం. అరిది జఘనం అంటే అరుదైన అంటే ఉందీ లేదా అన్నట్లు ఉన్న నడుము! అమ్మవారికి అయ్యవారిపై ఎంతో రాగం ఉన్నప్పటికీ, అయ్యవారి రాగంతో పోలిస్తే అమ్మవారి ఉండీ లేనట్టుట! అమ్మవారి విషయంలో నహి నిందా న్యాయం. జీవుల విషయంలో సహజం. అందుకే అన్నమయ్య నాయికా భావంలోని శృంగార కీర్తనల్లో కూడా సన్నని నడుముగా చెపుతారు జీవుడికి.

ఇంకా అమ్మవారికి అయ్యవారిపై ఆధార పడటమే తప్పించి ప్రత్యేకంగా అస్తిత్వం లేదు అని నేను చక్కని తల్లికి చాంగుభళా కీర్తనలో రాసిటనట్టు కూడా జఘనం (నడుము) విషయంలో చెప్పవచ్చు. దీనికి స్త్రీ పురుషుల్లో ఎవరు గొప్ప ఇలాంటి అర్థాలు తియ్యకూడదు. భగవంతుడు స్త్రీ పురుషనపుంసక భేదాలకి అతీతుడు.

నాభి అంటే కేంద్రం. భగవదనుగ్రహానికి ఆయన దయే మూలం!

చరణం3:
పట్టపు రాణి అని ఎందుకు అన్నారు అంటే, భగవంతుడికి ప్రపంచంలో ఉన్నవారు అందరూ భార్యలే! అయితే సమస్త విశ్వంలో ఉన్న జీవుల పట్ల ఆయన దయ లేదా శ్రద్ధని శ్రీదేవిగా, భూలోకంలో ఉన్న మన అందరి పట్ల శ్రద్ధని భూదేవిగా, ప్రతి ఒక్క జీవి పట్ల ఉన్న శ్రద్ధని నీళాదేవిగా చెపుతారు. అంచేత శ్రీదేవి పట్టపురాణి!

Click here for an audio visual: