Monday 30 December 2019

Essence of Bhagavad Gita


ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా




వివరణ:
ఉపనిషత్తుల సారమైన భగవద్గీత అత్యంత విజ్ఞాన దాయకమైనది. భగవంతుడే జీవుడి ఉనికికి ఆధారం అనీ, పోషకుడు, రక్షకుడు ఆయనే అని, ఆయనను స్మరించడం, విస్మరించడం ఆయన సంకల్పం వల్లనే అనీ స్వామి స్వయంగా అర్జునుడికి భగవద్గీతలో ఆనతిచ్చిన వైనాన్ని అన్నమయ్య మనకు ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నారు. వివేకంతో ఆయనని భజించమని బోధిస్తున్నారు.

చ : భూమిలోను చొచ్చిసర్వ భూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడనేను

గీతలో  పురుషోత్తమ ప్రాప్తి యోగం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా 
పుష్ణామి చౌషధీస్సర్వాః  సోమో భూత్వా రసాత్మకః 

నేను భూమిలో ప్రవేశించి సమస్త భూతాలనీ నా శక్తితో ధరిస్తాను. చంద్రుడి రూపంలో  పంటలన్నీ వృద్ధి చెందేలా  వాటికి తగిన తేమను కల్పిస్తాను. 

ఇక్కడ అన్నమయ్య ఓషధి అంటే మొక్క అనే అర్థాన్ని ఉపయోగించారు. భూమి మీద మొలిచే ప్రతి మొక్కా ప్రాణులకి ఉపయోగపడుతుంది. రసాత్మకః అన్న దానికి తేమలను కలిగించే వాడు అని అర్థం చెప్పారు. చంద్రుడు లేని వాతావరణంలో జీవరాశిని భూమిపై ఊహించలేము. 

కామించి అంటే సంకల్పించి అని అర్థం. పంటల్ని పండించడమే కాదు, ప్రారంభం నుంచి కూడా కలిగించేది ఆయనే కదా. అందుకే కలిగించి అన్నారు. 

చ : దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తేపుల నఱగించేటి దేవుడనేను
ఏపున ఇందరిలోని హృదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడనేను

గీతలో  తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం. 

నేను జఠరాగ్ని రూపంలో జీవుల శరీరంలో ఉండి ప్రాణ వాయువు సరిగా కలిగేలా, తేనుపులు సరిగా వచ్చేలా ఏర్పరుస్తాను . తద్వారా నాలుగు విధాలైన  అంటే పళ్ళు, పెదాలు, నాలుకని మూడు విధాలుగా  ఉపయోగించి తినేది , ఇంకా ద్రవరూపమై తాగబడేది (ఖాద్య చోష్య లేహ్య పేయ రూపకమైన ఆహారం)అయిన ఆహారం జీర్ణమయ్యేలా చూస్తాను. ఈ శ్లోకంలో పరమాత్మ ఆయుర్వేద విశేషాన్ని బోధిస్తున్నాడు. 

ఆ పై శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు:

సర్వస్య చాహం హృది సన్నివిష్టో 
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ 
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః 
వేదాంతకృత్ వేదవిదేవ చాహం. 

అందరి హృదయాల్లోనూ నేను చక్కగా ప్రవేశించి ఉంటాను. నా వలనే జ్ఞానం, తలపు, మరపు ఏర్పడతాయి. ఇక్కడ తమస్సుని పోగొట్టే జ్ఞానాన్ని అన్నమయ్య దీపించుట  అన్నారు. 


 చ : వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆదినే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను

రెండవ చరణంలో అన్నమయ్య ఉదహరించిన  శ్లోకంలో స్వామి ఇంకా ఇలా చెపుతున్నాడు:

వేదాలన్నిటి చేత తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతాన్ని ప్రసాదించినదీ, వేదం పూర్తిగా తెలిసినదీ నేనే. ఇక్కడ వేదం అంటే జ్ఞానం. స్వామి సర్వజ్ఞుడు.

ఇక్కడ వేదాంతవేత్తలచే అని చెప్పడం ద్వారా జ్ఞానులైన గురువులచే జగత్తుకి, వేదాలకు ఆదిగా తెలుసుకోదగిన వాడు స్వామి అని అన్నమయ్య భావం. దీనిని "తద్విద్ధి ప్రణిపాతేన" అనే జ్ఞానయోగంలోని గీతా శ్లోకంతో కలిపి అర్థం చేసుకోవాలి.

భగవద్గీత మోక్ష సన్న్యాస యోగంలో స్వామి ఇలా చెపుతారు:

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

అన్ని ధర్మాలని పక్కన పెట్టి  సర్వేశ్వరుడినైన నన్ను మాత్రమే నన్ను పొందటానికి ఉపాయంగా స్వీకరించు. నిన్ను అన్ని ప్రతిబంధకాలనుండీ నేను విముక్తుణ్ణి చేస్తాను. బాధ పడవద్దు.



దీనికి అన్నమయ్య "శ్రీదేవితో గూడి శ్రీవేంకటాద్రిమీద పాదైన దేవుడను" అని చెప్పారు.  సంస్కృతంలో శ్రయణాన్ని సూచించే శ్రీ  శబ్దం భగవంతుడు మనకు శరణు ప్రసాదించడాన్ని సూచిస్తుంది.  వేంకటమ్ అనే సంస్కృత పదం వేంగడం అనే ద్రావిడ పదంనుంచి వచ్చింది. వేం అంటే వేడి, కడంగళ్ అంటే కష్టాలు. భగవత్ ప్రాప్తికి కలిగే ఆటంకాలు అన్నీ భగవదనుగ్రహంతో మాడి మసైపోతాయి అని వేంకటమ్ అనే పదం తెలుపుతుంది. ఇలా అన్నమయ్య చరమ శ్లోకంగా చెప్పబడే ఈ శ్లోకాన్ని శ్రీ శ్రీనివాసుల పరంగా సరిగ్గా చెప్పారు.

పాదైన అన్నమాట ఈ విషయంలో స్వామికి స్థిరత్వాన్ని సూచిస్తోంది.

ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయా దిశతే శ్రీమద్ వేంకటేశాయ మంగళం|

Audio courtesy by Smt Sravani Ganti



Saturday 28 December 2019

Lord's grace showering on us

మచ్చికతో నేలవయ్య మదనసామ్రాజ్యలక్ష్మి
పచ్చి సింగారాలచేత బండారాలు నిండెను
॥పల్లవి॥
కొమరెతురుమునను గొప్పమేఘ ముదయించి
చెమటవాన గురిసెఁ జెక్కులవెంట
అమరఁ బులకలపైరు లంతటానుఁ జెలువొంది
ప్రమదాలవలపులపంట లివె పండెను
॥॥
మించులచూపుల తీగెమెఱుఁగు లిట్టె మెరిచి
అంచెఁ గోరికలజళ్లవె పట్టెను
సంచితపుకుచముల జవ్వనరాసులు మించె
పొంచి నవ్వుల మాని పోదిగొనె నిదిగో
॥॥
అలమేలుమంగమోవియమృతము కారుకమ్మి
నలువంక మోహపుసోనలు ముంచెను
యెలిమి శ్రీవేంకటేశ ఇంతి నెట్టె కూడితివి
కొలఁదిమీరి రతులకొటార్లు గూడెను

వివరణ:పల్లవి:

జీవేశ్వరుల సంయోగాన్ని, శ్రీమన్నారాయణుడి కృపనీ, ఈ కీర్తన తెలియచేస్తుంది. ఒకే కీర్తనలో జీవుడిని ఆయన ప్రియురాలిగా, ఆయన పట్టమహిషి జగదీశ్వరిని ఆయన కృపగా తెలపడం ఈ కీర్తన ప్రత్యేకత. 


మచ్చికతో ఏలవయ్య అంటే జీవుడిని అభిముఖుడిని చేసుకొని ఏలుకొమ్మని అర్థం. ఇద్దరూ అభిముఖులైతేనే కదా సంయోగం రక్తి కట్టేది! మద్ అనే ధాతువుని తృప్తి, హర్షం అనే అర్థంలో వాడతారు. కాబట్టి మదన సామ్రాజ్య లక్ష్మి అంటే జీవుడి బ్రహ్మానుభూతి అనే సంపద.

ఇంక "పచ్చి సింగారాల చేత బండారాలు నిండెను" అన్నదానికి అర్థం రెండవ చరణం రెండవ భాగంలో దొరుకుతుంది.

చరణం 1:

కొమెర (జీవుడు - ఈ పాటలో నాయిక) తురుములో అంటే జడలో గొప్ప మేఘం ఉదయించింది.  గొప్ప మేఘం అంటే నీల మేఘ శ్యాముడైన స్వామి. ఆయన దయని అందరిమీదా తారతమ్యం లేకుండా వర్షిస్తాడు కాబట్టి ఈ ఉపమానం చెపుతారు. 
జడలో స్వామి ఉదయించడం ఏమిటి? కేశాలు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానోదయం కాగానే ఆయన దయ వర్షించింది. ఇక్కడ చెమట నాయికదో, స్వామిదో చెప్పలేదు! స్వామిదే అయి ఉంటుంది. ఎలా అని అడక్కండి! అప్పుడే స్వామి దయామృత వర్షి అన్నది ఇక్కడ కుదురుతుంది.  
పులకలు బ్రహ్మానందానుభూతి. 
కృష్ణుడు అంటే భక్తిని కృషి (వ్యవసాయం) చేయువాడు అని అర్థం. అందుకే ఆయన ప్రమదాల వలపు పంట జీవుడిలో పండిస్తాడు!

చరణం 2:
నారాయణ సూక్తం "నీల తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అని అమ్మవారి గురించి చెపుతుంది. పరమాత్మ తన కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలమేఘం లాంటి వాడైతే ఆయనని దర్శింపచేసే మెరుపు తీగ జగన్మాత. ఈ ఉపమానం మనం అన్నమాచార్యుల "ఒకపరికొకపరి వయ్యారమై" కీర్తన ఆఖరి చరణంలో కూడా చూడవచ్చు. 
ఒకసారి మెరుపు మెఱయగానే మేఘం కనిపించింది. వర్షం మొదలైంది. ఇక భగవంతుడిని విరహ తాపంతో కోరుకుంటున్న జీవుడి కోరికలన్నీ జడివానలాగ తీరాయి. లేదూ ఆయనే జీవుడిని ఏరి కోరి అనుభవిస్తున్నాడని కూడా చెప్పవచ్చు. 

కుచములు అన్నమాచార్యుల వారి సంప్రదాయంలో శేషత్వం అనే లక్షణాన్ని సూచిస్తాయి. దీని అర్థం ప్రియురాలు ప్రియుడికి మాత్రమే చెందినట్లు జీవుడు భగవంతుడికి మాత్రమే చెందటం. ఇది జడ పదార్థాలకూ అమ్మవారికీ కూడా వర్తిస్తుంది. 

తాను స్వామికే చెందిన వాడిని అనే భావం జీవుడికి అతిశయించగా, పరమాత్మ యథేచ్ఛగా జీవుడిని బ్రహ్మానందంలో ముంచెత్తుతున్నాడు అని అర్థం. 

చరణం 3:
జీవుడిని అనుగ్రహించమని అనుక్షణం స్వామికి చెప్పేది శ్రీదేవి. ఆవిడ పై చరణంలో మెరుపుతో పోల్చబడింది. ఇక్కడ తన అమృతవాక్కులతో స్వామికి చెప్పగానే ఆశ్రితుడిపై ఆయనకి ఉన్న వ్యామోహం అన్ని వైపులా కమ్ముకొంది. ఇక్కడ మేఘం (స్వామి) ఉరుముతో కూడా అమ్మవారి వాక్కుని పోల్చవచ్చు. అమ్మవారు ఇలా స్వామికి చెప్పడాన్ని అన్నమయ్య సంప్రదాయంలో పురుషకారం (recommendation) అంటారు. 

అంతే, వెంటనే స్వామి జీవుడిని చేరుకొన్నాడు, దానితో జీవుడికీ పరమేశ్వరుడికీ శాశ్వతంగా యోగం కూడింది! 



Sunday 15 December 2019

Useful links - A good blog on Annamyya songs

Here is one more blogspot with no twisted interpretations and the philosophy in the songs is presented rightly to a great extent.

http://annamacharyulu.blogspot.com/

Tuesday 10 December 2019

In front of Him in sync and assured of His accepting us

తాళ్లపాక చినతిరుమలాచార్య
రేకు: 12-5 సంపుటము: 10-70

పల్లవి:

సవతులమైనాను సంగతి దప్పదగునా
రవళి వావిలిపాటి రామచంద్రు ముందర ॥పల్లవి॥

వివరణ:

ఇద్దరు భాగవతుల మధ్య సంభాషణ ఇది. జీవులందరు భగవంతుడికి భార్యలే. ఒక్కొక్క సారి బిడ్డలే. ఈ కీర్తనలో భార్యలుగా తీసుకొంటేనే నప్పుతుంది. 

భగవదనుగ్రహం కలిగిన ఒక జీవుడు మరొక జీవుడితో ఇలా అంటున్నాడు. 
మనం ఇద్దరమూ స్వామికి భార్యలమే. స్వామి భక్తులైన మనం సవతులం కదా అని అయన ఎదురుగా సంగతి, స్వరం తప్పవచ్చునా? అంటే పరస్పరం స్నేహభావంతో మెలగాలి అని అర్థం. సహ నౌ భునక్తు అన్నట్టు కలిసి భగవదనుభవం పొందాలి. 

1వ చరణం:


01.నీవనగా నే ననగా నిష్టూరా లేటికే
చేవదేరే మాట లెల్ల చిగిరించీని
మోవరాని దూరు లెల్ల మోపులు గట్టగాను
వేవేగ నిన్నియు మనవిభుడు మోచీనా ॥సవతుల॥

వివరణ:
శ్రీరామాయణంలో స్వామి "సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ" అంటాడు. అంటే "నన్ను  శరణు వేడిన సమస్త జీవులకి అభయాన్ని ఇస్తాను, ఇదే నా వ్రతం" అని చెపుతాడు. 
నిన్ను రక్షిస్తాడు అంటే నిన్ను రక్షిస్తాడు అంటూ అని నిష్ఠురాలు పోవడం దేనికి?  "అభయం సర్వభూతేభ్యో" అని అయన శ్రీరామాయణంలో అన్న మాట నాకు గుర్తుకు వస్తోంది. ఆయన ఏలుకోడు  అని నిందించడం ఎందుకు? దీని అంతటితో వేగిపోతే ఆయన మనల్ని మోస్తాడా?

ఇక్కడ రెండు విషయాలు చూడాలి. స్వామిపై నాయికకు ఉన్న ప్రేమాతిశయం మొదటిది. ఆయన సున్నితమైన మనస్సు ఎంత నొచ్చుకుంటుందో మనం వేసే నిందలు ఆయనకి ఎంత భారం అవుతాయో అని నాయిక భయం. రెండవది ఆయన తప్పక మోస్తాడు అన్న మహా విశ్వాసం.  ఈ రెండవ భావం మన భారం అంతా స్వామిదే అనే నిబ్బరాన్ని ఇస్తుంది. 
2వ చరణం:
02.కాదనగా నౌననగా కరకరేమిటికే
మీద మీద జగడాలు మితిమీరీని
వాదుల యీ సుద్దు లెల్ల వాములు వెట్టెగాను
కాదని మనవిభుడు గాదెల బోసీనా ॥సవతుల॥

వివరణ:
నీకు మాపై ప్రేమ ఉందనీ, కాదు, లేదనీ ఆయనపై మన ఈ కరకర కొరకరలు దేనికి ?  రోజు రోజుకి మనకి ఆయనతో గొడవలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఈ వాదులాటలు అన్నీ మోపులకొద్దీ అయితే కాదని మన స్వామి వాటిని ఏమైనా గాదెలో పడేసి ఉంచుతాడా? కాదు, తప్పక మనల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు అని భావం.

3వ చరణం:
03.రమ్మనగ పొమ్మనగ రారాపు లేటికే
దొమ్మి రేగి కాకలు తోదోపు లాడీని
నమ్మించి శ్రీవెంకటనాథుడు నిన్ను నన్నును
సమ్మతిగాగూడగాను సతము లై తిమిగా. ॥సవతుల॥

వివరణ:
స్వామితో రమ్మనీ పొమ్మనీ ఈ కఠినమైన ఘర్షణలు దేనికి? విరహ తాపంతో మనం ఇద్దరం స్వామిని కలవడానికి ఒకరు అంటే ఒకరు అని ఉన్నాం. ఎలాగో నమ్మించి ఆయన మనల్ని తన సమ్మతితో కూడడంతో మనకి ఒక అర్థవంతమైన అస్తిత్వం (సత్త) వచ్చింది కదా!


Thursday 14 November 2019

The Mother Who suits the Supreme Lord

Chakkani Talliki chAngu bhaLA - explanation in Telugu and English with commentary

పల్లవి:

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా


Pallavi:

chakkani talliki chAngu bhaLA tana
chakkera mOviki chAngu bhaLA


వివరణ:
శ్రీమన్నారాయణుడు మనలని లక్షించి రక్షించే తత్త్వమే లక్ష్మీదేవి. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి "రాఘవోర్హతి వైదేహీం" అన్నట్లుగా కల్యాణ గుణాభిరాముడైన ఆ భగవంతుడికి అన్నివిధాలా అనురూప అయిన ఆ చక్కని తల్లికి మేలు, జయం, మంగళం అంటున్నారు అన్నమయ్య. ఇక్కడ మేలు అంటే విముఖులైన మనలని తమపట్ల అభిముఖులుగా చేసుకోవడమే ఆ లక్ష్మీనారాయణులు తమకు తాము చేసుకొనే మేలు. 

"పలుకు తేనెల తల్లి పవళించెను" అని అన్నమయ్య అన్నట్లుగా మనకి హితమైన మధురవాక్కులను ఉపదేశించే ఆ తల్లి వదనానికి మంగళం.  

Explanation:


As the root laksh in Sanskrit stands for looking at or aiming at, the Divine Mother is called Lakshmi and She stands for the aspect of Lord's targeting us and uplifting. As sage Valmiki says in Sri Ramayana  "rAghavOrhati vaidEhIm" that sItA suits well Lord Rama, She befits Lord SrimannArAyaNa in all Her qualities. Annamayya sings all glories to such beautiful Mother and says may good happen to Her. Here good means, blessing us and turning towards Themselves i.e. The Divine Couple.


As Sri Annamcharya says in another song "paluku tEnela talli pavLinchenu", - The Mother is of nectarine words as all Sastras are from SrImannArAyaNa and SrI and Narayana are not separate. Annamayya sings all glories to Her such bright face of sweet words.


చరణం 1:
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

CharaNam 1:

kulikeDi muripepu kummarimpu tana
saLupu jUpulaku chAngu bhaLA
palukula sompula patitO kasareDi
chalamula alukaku chAngubhaLA

వివరణ:
శ్రీహరి చేసే సృష్టి స్థితి లయాలకు తన క్రీగంటి చూపుతో అనుజ్ఞ ఇస్తూ ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యకలాపాలకు మురిసిపోతూ ఉండే ఆమె దృక్కులకు మంగళం. 
ఆశ్రితులని  రక్షించమని సర్వేశ్వరుడితో అందంగా వాదులాడి అలిగే ఆమె క్షణికమైన అలుకకు మంగళం. 


Explanation:

She looks at Lord Sri Hari providing Her consent to the creation, protection and destruction that He takes up. She looks at His wonderful deeds with great adoration and astonishment. All glories to Her such looks.

She pleads with the Lord to protect us and acts as if She is angry with Him in the process. All glories to Her momentary anger!

చరణం 2:

కిన్నెరతో పతికెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

CharaNam 2:

kinneratO patikelana niluchu tana
channu meRugulaku chAngubhaLA
unnati patipai noragi niluchu tana
sannapu nadimiki chAngu bhaLA




వివరణ:
"వరవీణామృదుపాణి" అని సంగీతకారులు దర్శించినట్లుగా కిన్నెర వాయిస్తూ తన పతికి ఎదురు నిలిచిన జగన్మాత మంగళసూత్రమైన శ్రీవారి వైభవాలకు మంగళం.  ఇక్కడ అన్నమాచార్యులవారి పూర్వాచార్యులైన పరాశర భట్టార్యుల  "శ్రీ స్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే"  అన్న శ్రీసూక్తి స్మరణీయం. 

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని వీణాధారిణి  అయిన లక్ష్మీదేవిగా అలంకరించడం మనకు విదితమే కదా!

శ్రీమన్నారాయణుడిని మాత్రమే ఆధారంగా కలిగి తనకు వేరే అస్తిత్వం లేదు అని సూచించే విధంగా ఆయనపై ఒరిగి నిలుచున్న ఆమె తత్త్వానికి మంగళం. 

Explanation:

She plays "Kinnera" a musical instrument and faces Her Lord. The Lord shines on Her chest as Her mangaLa sUtra. All glories to the magnificence of the Lord Who thus shines. Here it is worth noting that musicians visualize the Divine Mother as "Vara Veena MRdu pANi" or the one playing a great Veena. The Lord of seven hills is decorated as Goddess Lakshmi playing Veena during brahmOtsavams. Also it is worth noting Sri Parasara Bhattar's Sri Sookti "SrI stanAbharaNam tEja: SrI rangESayam ASrayE" - we take refuge in Lord Ranganatha Who shines as the chest ornament or Mangala Sutra of the Mother of the Universe Sridevi.

Indicating that Lakshmi and Narayana are not separate and She does not have a separate identity on Her own, She stands taking support from Him on Her waist. All glories to such Divine Mother!

చరణం 3:

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెనచిన తన
సంది దండలకు చాంగుభళా

CharaNam 3:

Jandepu muthyapu sarula hAramula
chandana gandhiki chAngu bhaLA
vindayi venkaTa vibhu benachina tana
sandi danDalaku chAngu bhaLA


వివరణ:
ముత్యాన్ని సంస్కృతంలో ముక్తం అంటారు. తాను చెప్పిన వారికి ముక్తిని ఇచ్చే ముకుందుని పత్ని ముత్యాల హారాల్ని  ధరించడం ఉచితమే కదా! భగవంతుడిని ఆహ్లాదపరిచే చందనం వంటి అత్యంత భోగ్యమైన ఆ దేవికి మంగళం. చందన పరిమళం ఆవరించినట్లుగా భోగ్యంగా ఆయనని కట్టివేసే  ఆ కల్పవల్లి బాహువులకు మంగళం. అమ్మవారి ఈ లక్షణాన్ని సంశ్లేషైక భోగ్యత్వం అంటారు. భగవంతుడు తన కృపచే కట్టివేయబడతాడు అన్నది విశేషార్థం. 


Explanation:

All glories to the Divine Mother, Who is for the exclusive enjoyment of the Lord like a sandal paste, wearing necklaces of pearls. Pearl is called "muktam" in Sanskrit which also means something liberated. For the Divine Mother, Who mediates on behalf of the living beings or jIvas for their liberation as His kRpA or compassion personified, it is looks very apt to wear a necklace of muktams! Here it is to be further noted that the Lord is called Mukunda or The One Who grants liberation.


Like the fragrance from the sandal pervades, She embraces the Lord as His object of enjoyment and all glories to Her hands that tightly hold the Lord! This metaphorically means that the Lord is bound by His own kRpA or compassion.

Audio by Smt Sravani Ganti

Tuesday 12 November 2019

Accepting the world and life


In this song, Sri Annamayya is again teaching us a practical way of life accepting it as a reality and urging us to have faith that He is here to take care of us.

Pallavi:
This body that has blossomed, could be a flower or could be a tender fruit. Still who can bear its burden (only He can!).

Charanam 1:
The providence who made us take birth, will it feed us with grass? (He will take care of us, is the bhAvam).
The karma to which we have been attached, will it go away?
We have stepped into this world, let us be content with that. Let us not blame our parents for this (since it is His will or providence that made us take birth).

Charanam 2:
The writing on our forehead by BrahmA, can it be wiped off?
Is this world new to us?
Let us be content with being alive with our prANam! I do not want any further births hereafter.

Charanam 3:
Whatever My Ruler Lord Srihari does, is good for me. Now He is SrIvEnkaTESa! He rules over us in umpteen ways and we are happy and content under His rule!
To understand what SrI means, please see some of my previous posts. Hari stands for the Lord Who gets us rid of our karma (puNya and pApa).

పూచిన యీదేహము పువ్వుగాని పిందెగాని
చేచేత నెవ్వరికి జెప్పనోప బ్రియము
పుట్టించినదైవము పూరి మేపునా మమ్ము
బట్టిన పూర్వకర్మము పాసిపొయ్యీనా
మెట్టినసంసారము మెదిగినపాటే చాలు
తొట్టి కన్నవారినెల్ల దూరనోప మిందుకు
నొసల వ్రాసిన వ్రాలు నునిగితే మానినా
కొసరి జగము నాకే కొత్తలయ్యీనా
వుసురుతోడిసుఖము వుందినపాటే చాలు
కొసరి జన్మము లింకా గోరనోప నేను
యేలినవాడు శ్రీ హరి యేమిసేసినా మేలె
వేళతో నాతడే శ్రీవేంకటేశుడు
పాలించె నాతడు మమ్ము పదివేలులాగులను
యీలాగులనే సుఖించేము నేము

Saturday 26 October 2019

swayam jAtah

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన..
యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను
యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే // పల్లవి //

పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతిఁ బ్రాణప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ముఁగాచెడికొరకు
హరి నీమూర్తి ప్రాణ మావహించవే // యజ్ఞ //
జగతికి నీపాదజలమే సంప్రోక్షణ
జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్ను నేఁడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే // యజ్ఞ //
వేదములు దెచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు
వేదమంత్రముల పూజావిధి సేసేమా
యీదెస నీదాసులమయిన మమ్ముఁ గాచుటకు
వేదమూర్తివై యిందే విచ్చేసి వుండవే // యజ్ఞ //



Introduction

Many rituals are performed as part of the temple worship. While this temple worship as per Agama Sastras
is necessary for a disciplined way of running the temples, exalted devotees like Azhwars or Annamacharya
never emphasized on them. Their teaching is that the Lord is so powerful and benevolent that He blesses us
out of His volition without any wanting on our part. This is called nirhEtuka kRpA or causeless mercy of the Lord.

The title given to this article is swayam jAtah, a name in Sri Vishnu Sahasra Namam, which is defined by Sri
Parsara Bhattar as "prArthanA nirapEkshatvAt jAtah" One Who appears on His own without even expecting a small
prayer from us.


Pallavi

YagnamUrthi yagnakartha yagnabhOktha vinnitAnu
yagnAdhi phalarUpamitu nIvai yundavE

Meaning:
Yagna, doer of the yagna, enjoyer of the yagna and the result of the yagna, all are You. In Sanskrit, the root "yaj"
means worshipping the God. The Vedic belief is that one propitiates the Supreme Being and other deities by
performing Yagnas. As Vedas say "yagnO vai vishNu:", the Lord Himself is the best Yagna on Whom we have to
depend to realize Him and reach Him.

Charanam 1:
parikincha jIvulaku prANamaina nIku
nirtathi brANa prathishTa nEmu sEsEmA?
marigi mA pUjalandhi mammu gAcheDi koRaku
Hari! nI mUrthi prANam AvahinchavE

Meaning:
If we analyze, You are the life all all living beings! Then who are we to do consecrate You in the form of an icon, a
practice calledprANa prathishTA? However, to get used to our worship and to protect us (by providing confidence),
Oh Hari, please enter this image (mUrthi) of Yours.

Charanam 2:  
jagathiki nI pAdha jalamE samprOkshaNa
jigi nIku samprOkshaNa sEyuvAramA?
pagaTuna nannu nEdu pAvanamu sEyutaku
agu puNyathIrthamula abhishEkamandhavE

Meaning: 
The water with which BrahmA washed Your lotus feet purifies the whole world. Then who are we to do
samprOkshaNam to You which is a ritual of purification using water ? However, accept the  ablution done by us to
bless me with the sacred water that has washed Your feet!

 Charanam 3:
vEdhamulu decchina SrIvEnkatESa nEmu nIku
vEdha manthramula pUjAvidhi sEsEmA?
yI dhesa nI dhAsulayina mammu gAchutaku
vEdhamUrthivai yindhE vicchEsi yundavE

Meaning:  
Oh Lord SrIvEnkatESa! Who are we to worship You with Vedic hymns, The One Who brought out the Vedas? As we
have been Your servants here, to protect us, be the very embodiment of Vedas, come and stay in this icon.

Audio link:






  

Thursday 10 October 2019

భగవద్రక్షణ ఆవశ్యకత - Need for Lord's protection of the ignorant and week

ప|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా || చ|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా | వఱత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని తివియ(గ దానేలా || చ|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా | అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా || చ|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా | ధృతిహీను గృపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||


పల్లవి:

భగవద్గీతలో శ్రీకృష్ణుడు "తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః| నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీ పేన భాస్వతా|" అంటాడు (గీత 10వ అధ్యాయం 11వ శ్లోకం). దీని భావం తన భక్తుల హృదయాల్లో అంతరాత్మగా ఉండే స్వామి వారిలో అజ్ఞానం వల్ల తనని తెలుసుకొనలేకపోవడం అనే తమస్సుని జ్ఞానమనే దీపంతో పోగొడతారు అని. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు దీపం అనేది చీకటిలో అవసరం కానీ పెద్ద వెలుగులో మరొక వెలుగెందుకు అంటారు. అంటే స్వామి దయ సదా పరమపదంలో ఆయనను సేవించే నిత్యులపై, ముక్తులపై కన్నా, వాసుదేవుడే సర్వమనే మహావిశ్వాసం కల జ్ఞానులపై కన్నా, రక్షిస్తాడో రక్షించడో అనే భయంతో ఉన్న సాధారణ జీవులపైన ప్రసరించి వారిని కూడా తరింపచేయడమే ఎక్కువ అవసరం అని అర్థం.ఇదే పల్లవిలో భావం.

మొదటి చరణం: మొదటి చరణంలో ఆపదలో ఉన్న వారికి స్వామి అభయం అవసరం కానీ సుఖంగా ఉన్నవారికి ఎందుకు అంటారు. ఆపదలో చిక్కుకొన్న గజేంద్రుడు, శ్రీవిభీషణుడు వంటి వారికి అభయం అవసరమే కానీ, సర్వేశ్వరుడే తమ సర్వస్వం అని తెలిసిన హనుమంతుడి వంటి నిర్భయులకి అభయం అవసరం లేదు కదా! అలాగే అన్నమయ్య సంసారమనే వరదలో కొట్టుకు పోతున్న వాడి మార్గాన్ని ఆ కరివరదుడు చక్కదిద్దాలి కానీ, ఒడ్డున ఉన్నవాడికి రక్షణ అవసరం ఏముంది? రెండవ చరణం: భగవద్గీతలొ "అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః" (గీత 18.66) అన్నట్లుగా అనేక కర్మలచేత బంధించబడిన వాడి కర్మ పాశాలని స్వామి విప్పాలి కానీ, వాటినుండి విముక్తుడై స్వామిని పొందినవాడిని ఇంకా రక్షించడానికి ఏమి ఉంది? బలహీనుడికి ఆహారాన్ని ఇవ్వాలి కానీ, తృప్తి చెందినవాడికి ఇంకా ఏమి ఇవ్వాలి? వేదంలో "తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః" అని చెప్పినట్లు ఆ ఆనందనిలయుడి పరమపదం ఎల్లప్పుడూ నిత్యుల చేత, ముక్తుల చేత సేవింపబడుతూనే ఉంటుంది. ఇక్కడ అన్నం తినడం అంటే సర్వేశ్వరుడిని అనుభవించడమే. నమ్మాళ్వారులు తిరువాయ్ మొళిలో "ఉణ్ణుం శోఱు" అనే పాశురంలో చెప్పినట్లుగా (6.7.1) తినే తిండి, త్రాగే నీరు, అ తర్వాత నమిలే తమలపాకులు, భగవదనుభవం కోసం తహతహలాడుతున్న వాడికి సర్వమూ పుండరీకాక్షుడైన కృష్ణుడే. మూడవ చరణం: అంతులేని పాపాలు చేసిన వాడికి ఆయన రక్షణ అవసరం కానీ, తనకి ఏది హితమో తెలిసిన పుణ్యుడికి ఎందుకు? ఇక్కడ పాపాలు అంటే వ్యర్థమైన కార్యకలాపాలు అన్నీ. హితం అంటే ఆత్మని భగవంతుడు ఉద్ధరిస్తాడు అనే విశ్వాసాన్ని కలగజేసేది, ఇది ఆచార్యుల వాక్కు. పుణ్యుడు అంటే భగవదనుగ్రంచేత హితాన్ని తెలుసుకొని ధన్యుడైనవాడు. భగవంతుడు రక్షిస్తాడో రక్షించడో అనే ధైర్యహీనుడిని శ్రీవేంకటేశ్వరుడు కృపతో వీక్షించి రక్షించకపోతే ఇంక ఆయన ఎందుకు? తప్పక రక్షిస్తాడు అని భావం. ఇక్కడ శ్రీదేవి (తిరు) భగవత్కృప.

Audio link :
Courtesy Smt Ganti Sravani :

https://www.youtube.com/watch?v=2VVnjDenpNQ&t=4s

Saturday 24 August 2019

Krishnam Vande Jagadgurum!

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్|

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టినభోగి జ్ఞానయోగి // పల్లవి //
అపరిమితములైనయజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి // తానే //
అన్నిచేఁతలను బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరంగఁ గరుణించు
పన్నగశయనుఁడే బ్రహ్మయోగి // తానే //
తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైనమహిమ శ్రీవేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాసయోగి // తానే //

అన్నమాచార్యుల సంప్రదాయంలో భగవంతుడు శ్రీనివాసుడు ప్రథమ గురువు. జగన్మాత శ్రీదేవి రెండవ గురువు. 

భగవద్గీతా సారాన్ని అన్నమాచార్యులవారు ఇందులో బోధిస్తున్నారు.

పల్లవి:

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టినభోగి జ్ఞానయోగి 

సంస్కృతంలో యుజ్ అనే ధాతువుని కలిపి ఉంచడం అనే అర్థంలో వాడతారు.  అందరికీ అంతర్యామిగా అందరితోనూ నిత్యం కలసి ఉండే సర్వేశ్వరుడే అందరికీ గురుడు, అందరికన్నా పెద్ద యోగి!

చరణం 1:

అపరిమితములైనయజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి 

భోక్తారం యజ్ఞ తపసాం అని భగవద్గీతలో అన్నట్లుగా (5.29) ఆయనే సమస్త యజ్ఞాలకూ తపస్సులకూ భోక్త. "పత్రం పుష్పం ఫలం తోయం" అన్నట్లుగా భక్తులు పత్రం, పుష్పం, ఫలం, జలం ఏది సమర్పించినా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు (గీత 9.26).  జగత్తునంతటినీ నిరంతరం అనుభవించడంలో నేర్పరి. "వాసుదేవః సర్వమితి"  అన్నట్టుగా వాసుదేవుడే సర్వమని (గీత 7.19) తలచే జ్ఞానులకు నిరంతరము లభించే జ్ఞాన యోగి. 

భోక్తారం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం 
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి| 

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి 
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః | 

బహూనాం జన్మనామ్ అంతే జ్ఞానవాన్ మామ్ ప్రపద్యతే 
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః | 

చరణం 2:
అన్నిచేఁతలను బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరంగఁ గరుణించు
పన్నగశయనుఁడే బ్రహ్మయోగి

యజ్ అనే ధాతువు సంస్కృతంలో దేవపూజ అనే అర్థంలో వాడతారు. 
భగవంతుడే సర్వమని తెలిసిన వాడు ప్రపన్నుడు (7.19). అలాంటి ప్రపన్నులు చేసేది జ్ఞాన యజ్ఞం. ఆ విధంగా జ్ఞానం ద్వారా ప్రపన్నులచే అనేక విధాలుగా అర్చించబడే వాడు స్వామి. ఇక్కడ "జ్ఞానయజ్ఞమీగతి మోక్ష సాధనము" అన్న కీర్తన గమనించతగ్గది. 
తపస్సు అంటే భగవంతుడి పాదాలవద్ద అణిగి ఉండటమే. "మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా" (గీత 3.30) అని చెప్పి సర్వకర్మలయందూ మమకారాన్ని త్యజించి వాటిని తనకే విడిచి పెట్టమని చెప్పిన స్వామి కర్మయోగి!
ఇదే విషయాన్ని రామే సంన్యస్త మనసా, తపస్వినీ, అని వాల్మీకి మహర్షి సీతమ్మ వారి గురించి చెప్పగా దాన్ని నమ్మాళ్వార్లు మరింత విశదంగా మన అందరికీ వర్తించేలాగ చెప్పారు. 

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: అని గీతలో (4.24) అన్నట్లుగా చేసేదంతా బ్రహ్మమయంగా భావించే వారు ఆ పరబ్రహ్మాన్నే పొందుతారు (బ్రహ్మైవ తేన గంతవ్యం). వారిని తాను ఏలుకుంటాను అని తెలియజెప్పి, చివరకు కరుణతో  తన పదాన్ని అనుగ్రహించే ఆ యోగనిద్రలో ఉన్న పన్నగశాయి "బ్రహ్మయోగి"! ఇక్కడ యోగనిద్ర జగద్రక్షణ చింతనాన్ని సూచిస్తుంది. 

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః |

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం 
బ్రహ్మైవ  తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా| 

చరణం 3:
భాగవత పురాణంలో కపిల మహర్షి, దత్తాత్రేయుల వారు ఇత్యాదులు భగవంతుడి అంశావతారాలు. తానే స్వయంగా ఈ విధంగా సుప్రసిద్ధులైన యోగులుగా అవతరించి భాగవతధర్మాన్ని వ్యాప్తి చేసాడు స్వామి. అంతకంటే ఘనమైన మహిమ కల పరిపూర్ణావతారమైన శ్రీవేంకటేశ్వరుడిగా శ్రీదేవితో కూడిన తన సంసారయోగాన్ని మనకు శరణ్యంగా  నిరంతరం శ్రీవేంకటాద్రిపై కృప చేయడం అభ్యాసంగా కల యోగి స్వామి! 

Audio link:
https://www.youtube.com/watch?v=fOhkPhqcBcg&feature=share

Monday 19 August 2019

Influence of Azhwars' Tamil literature on annamayya

SrI annamAchArya wrote the songs in Lord's praise inspired by the divyaprabandham of Azhwars, the ancient Tamil poets who sang in His praise and preached a simple and practical philosophy that transcends all barriers like caste etc.
In Azhwars' philosophy, Lord nArAyaNa is the sole protector and the ultimate goal for every individual. His consort SrI stands for His kRpA or mercy. 

In many hymns of Azhwars, the Lord is the hero and the individual soul or jeeva is the heroine. Philosophically, the Lord is considered the only male and all  other beings are considered females.

Below is one song which was composed by annamayya under the influence of the Azhwars' verses or pASurams.

వుప్పతిల్లీ జవ్వనము వొళ్ళి మీఁదను
యెప్పుడు మఱవరాదు యేమి సేతునే ॥పల్లవి॥

vuppathillI javvanamu voLLi mIdhanu
yeppuDu maRavarAdu yEmi sEthunE ||pallavi||
As the youthfulness of my body and associated desires are at the peak, I am not able to forget Him anytime. What can I do?

చిలుకతో మాటాడితే చిమ్మి రేఁచీ వలపులు

కొలని లోపల నైతే నళుల బాద
పలు దిక్కులుఁ జూచితే పరగీ వెన్నెల వేఁడి
యెలమి నెందుఁ బోరాదు యేమి సేతునే ॥॥

charaNam 1:
chilukathO mAtADithE chimmi rEchI valapulu
kolani lOpalanaithE naLula bAdha
palu dikkulu jUchithE paragIi vennela vEDi
yelami nendu bOrAdhu yEmi sEthunE

As I speak to the parrot, my love for Him is multiplies manifold. As I enter the pond, I am perturbed by the bees. As I look around the sky in the night, I am tortured by the heat of the moonlight! Where else can I go and what else can I do?

సింగారపుఁ దోఁట నుంటే చిగురులు బెదరించీ
కంగి చింతించితే మదిఁ గంతుఁ డున్నాఁడు
కొంగున విసురుకొంటే గుప్పించీఁ జల్లగాలి
యింగితము దెలియదు యేమి సేతునే ॥॥


charaNam 2:
singArapu thOtanunTE chigurulu bedharinchI
kangi chinthinchithE madhi kanthuDunnADu
konguna visurukunTE guppinchI challagAli
yingitham teliyadhu yEmi sEthunE

As I enter the beautiful garden, the tender leaves scare me. As I try to think about my plight, there is manmatha in my mind who is disturbing me to unite with  Him. As I fan myself with the upper garment, the cool breeze disturbs me. I don't know what is right. What can I do?

కత లాలకించే నంటే కలసీఁ గోవిలఁ కూత
మితి నేకతాన నుంటే మించీఁ గోరిక
గతియై యింతలో శ్రీ వేంకటేశుఁ డు నన్ను నేలే
యితని వుప కారాన కేమి సేతునే ॥॥(12/209)


kathalAlakinchEnanTE kalasI kOvila kUtha
mithi nEkathAna nunTE minchI kOrika
gathiyai yinthalO SrIvEnkaTESudu nannu nElE
yithani vupakArAnakEmi sEthunE

As I plan to listen to the stories about Him, the sweet voice of the cuckoo disturbs me. If I leave myself alone, my desire for Him has no bounds. In the meantime, SrIvEnkaTESa, Who is my means, has come to me and ruled over me. What can I do for Him in return?

చిలుక, కోకిల భగవద్గుణ కీర్తనం పరమ భాగవతోత్తముని సూచిస్తుంది. ఈయనతో మాట్లాడిన జీవుడి భగవద్విరహం మరింత ఎక్కువైంది! తుమ్మెదలు పూలలో మకరందాన్ని మాత్రమే గ్రోలుతాయి. అదే విధంగా భాగవతోత్తములు కూడా భగవంతుడి పాదారవిందాలయందు మాత్రమే అనురక్తి కలిగి ఉంటారు. 

చివరలో అలమేలు మంగా సమేతుడైన వేంకటేశుడు (శ్రీవేంకటేశుడు) నాకు గతి గమ్యం తానే అయి నన్ను ఏలాడు అని మనలాంటి వారందరికీ విశ్వాసాన్ని కలుగజేయడం జరుగుతుంది. ఆయనకు ప్రత్యుపకారం ఏమీ చెయ్యలేము!

ఇది ఆళ్వారుల తమిళ పాశురాలు స్ఫూర్తిగా తీసుకుని అన్నమయ్య వ్రాసిన కీర్తన.

Sunday 30 June 2019

A nice folk song by annamayya "rAvE kODala raTTaDi kODala"

Added English translation as planned before. Please see after the Telugu text.

॥పల్లవి॥ రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులునీతోఁజాలును

॥చ1॥ రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా

॥చ2॥ ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా

॥చ3॥ బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని-
నడ్డగించుకొంటివత్తయ్యా

వివరణ:

వ్యర్థమైన వ్యాపారాలన్నీ వదలి శ్రీనివాసుడిని ఆశ్రయించమని ఇద్దరు అత్తా కోడళ్ల మధ్య మొరటు సరస సంభాషణ రూపంలో ఈ కీర్తనలో అన్నమయ్య బోధిస్తున్నారు. ఇక్కడ అత్తా కోడళ్లు ఇద్దరు జీవులని సూచిస్తారు.

మాంచ యో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నట్లుగా (గీత 14వ అధ్యాయం 26 వ శ్లోకం) భగవంతుడిని అనన్య భక్తితో ఆశ్రయించి సేవించినవాడు అవ్యయమైన స్థితిని చేరుతాడు. ఇక్కడ భగవంతుడు అంటే శ్రీనివాసుడు, లక్ష్మీదేవిని తన వక్షస్స్థలంలో నిలుపుకొన్నవాడు, అంతే కానీ ఆవిడ లేని నారాయణుడు ఎప్పుడూ కాదు. అందుకే అన్నమయ్య "పుట్టు భోగులము మేము" కీర్తనలో తల్లి యాకే మగని దైవమని కొలిచేము (జగన్మాత భర్తని దైవంగా కొలిచాము) అంటారు. 

ఆచార్య అనుగ్రహంతో జగజ్జననీ జనకులని (శ్రీదేవితో కూడిన శ్రీవేంకటేశ్వరుణ్ణి) ఆశ్రయించడానికి ముందు ఇద్దరు జీవుల పరిస్థితిని ఈ కీర్తన సూచిస్తోంది.

పల్లవి:
మొదటి జీవుడు (అత్త): కోడలా రా! నీ గుట్టు రట్టు చేస్తాను!
రెండవ జీవుడు (కోడలు): పో పో అత్తా! నీతో నాకు ఇంక స్నేహం ఏమీ లేదు, నీ దోస్తు కటీఫ్!

చరణం 1:
మొదటి జీవుడు (అత్త): నువ్వు రాజుల మెప్పు పొందాలని వారి ఎదురుగుండా వారిపై బిగ్గరగా స్తోత్రాలు చేస్తూ జంకూ బెంకూ లేకుండా తిరిగావు.
రెండవ జీవుడు (కోడలు): ఓ చక్కనమ్మా! నువ్వు మాత్రం ఏమి తక్కువ తిన్నావు? దొడ్డవారు కానివారిని దొడ్డ వారు అనుకుని వారి మెప్పు కోసం అనేక మంది ఇళ్ళల్లో తిరిగావు.

ఎవరైనా స్తోత్రం చేస్తే పోతనలా సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యాలి. నిజమైన దొడ్డవారు పరమభాగవతోత్తములు, వారి ఇంట ఊడిగం చెయ్యాలి.

చరణం 2:
మొదటి జీవుడు (అత్త): అక్కడా ఇక్కడా నువ్వు అనేకమంది మగవాళ్ళతో సిగ్గు లేకుండా జట్టు కట్టావు. (అంటే భగవంతుణ్ణి కాకుండా పలువురు ఇతరులని ఆశ్రయించావు అని అర్థం.)
రెండవ జీవుడు (కోడలు): నేను ఏదో నా పాట్లు పడ్డాను. నువ్వు మాత్రం ప్రతి చోటా పదేసి మందిని మోహింపచేసుకున్నావు (మోసగించావు అని అర్థం).

భగవంతుడిపై అనన్య భక్తియే పాతివ్రత్యధర్మం అని అన్నమయ్య "అన్నిట నీవంతర్యామివి అవుట ధర్మమే అయినాను" అనే కీర్తనలో అంటారు.

చరణం 3:
మొదటి జీవుడు (అత్త): నా కడుపున (బొడ్డున) పుట్టిన పిల్ల వాడికి నిన్ను వ్యర్థంగా తీసుకుని వచ్చాను. (నీతో బాంధవ్యం లేదా సాంగత్యం వ్యర్థమని భావం. నిజమైన ఆత్మబంధువులు పరమ భాగవతోత్తములే.)
రెండవ జీవుడు (కోడలు): గుడ్డము పయినున్న కోనేటి రాయని అడ్డగించుకొంటినత్తయ్యా! (లేదా)
గుడ్డము పయినున్న కోనేటి రాయని అడ్డగించుకొంటివత్తయ్యా!

ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి.మొదటి అర్థంలో "నేను ఇకపైన ఎంతమాత్రం వ్యర్థురాలిని కాదు. కొండ పై నెలకొన్న కోనేటి రాయుడిని ఆశ్రయించాను" అని కోడలు చెపుతోంది. రెండవ అర్థంలో "ఓ అత్తా! నిన్ను ఒకటి వేద్దాం అనుకుంటే కోనేటి రాయుడిని అడ్డం పెట్టుకొన్నావు కాబట్టి బతికిపోయావు" అని అర్థం వస్తుంది!

ఇంతకీ ఎలాంటి స్వామిని ఆశ్రయించారు? శ్రీనివాసుణ్ణి. రాక్షసస్త్రీలను కూడా క్షమించి వదిలెయ్యమని హనుమన్నతో శ్రీరామాయణంలో చెప్పిన అమ్మ వక్షస్స్థలంలో ఉండగా ఆ స్వామి ఆశ్రయం ఇవ్వక ఒదులుతాడా? కాబట్టి ఆశ్రయించినవారు ఎవ్వరైనా క్షేమమే!

ఇక్కడ కోనేరు అంటే అందరికీ తెలిసిందే. స్వామి దేవితో కలసి విహరించే పుష్కరిణి కాబట్టి ఆ పుష్కరిణిని అత్యంత పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. స్వామి కోనేటి రాయడు అంటే తరింపచేసేవాడు.

Meaning and explanation in English:

In this song, Sri Annamacharya encourages us to give up all wasteful acts and resorting to things of lesser importance and take refuge in the Supreme Being Srinivasa. This song is in the form of a dialog between two ladies of a village one of whom is the daughter-in-law and the other is the mother-in-law. Each represent an ordinary human being who transformed into a devotee and the discussion is in the form of criticizing each other for the other's past deeds. Let us call the mother-in-law as Jiva 1 and daughter-in-law as Jiva 2.

Pallavi:

rAvE kODala raTTaDi kODala
pOvE pOvE attayyA! pondulu nItO chAlunu

Meaning:

Mother-in-law (Jiva 1): Oh my dear daughter-in-law, come here. I will expose all your secrets.
Daughter-in-law (Jiva 2): Go away, my mother-in-law, go away! No more friendship with you!

CharaNam 1:

rankelu vEyuchu rAjuleduTa nIvu
konku gosaru lEni kODala
pankajamukhi nIvu palu doDDa vArinDla
ankela dirigEvu attayyA!

Meaning and explanation:

Jiva 1: You have praised several kings assuming they are the protectors very loudly in front of them. 
Jiva 2: On the other hand, oh my beautiful mother-in-law! You have been to the places of numerous wealthy people thinking them to be wealthy to earn their good will. You were no less mischievous than me!

Here it is conveyed that the Lord alone is praiseworthy. A real devotee never aspires to be in the good books of the kings and the mighty. Similarly the real wealthy people are His devotees or bhAgavatOttamas. One has to be always subservient to them and serve them with keen interest.

CharaNam 2:

IDADa naluguru nEguru mogalatO
kUDi siggulEni kODalA!
vADaku paduguri valampinchukoni nIvu
ADAda tirigEvu attayyA!

Meaning and explanation:

Jiva 1: Oh shameless lady! You have united with 4-5 gentlemen here and there.
Jiva 2: Oh my mother-in-law! At every place, you have made some 10 people fall in love with you and have roamed here and there.

First statement metaphorically talks about taking refuge in deities and entities other than the Supreme Being.
Second statement talks about deceiving fellow beings.

CharaNam 3:

boDDuna buTTina pUpanikE ninnu 
goDDEru testinE kODalA!
guDDamu payinunna konETi rAyani
naDDaginchukonTinattayyA or aDDaginchukonTivattayyA!

Meaning and explanation:

Jiva 1: I have wastefully made you the wife of my son born from my womb (here it is written boDDu which means navel that represents the stomach).

Jiva 2: Oh my mother-in-law, I am no more useless, as I have taken refuge in the Lord the great temple pond called kOnEru or swAmi pushkariNI.

Conversely, when the Telugu text is "aDDaginchukonTivattayyA", this means - Oh my mother-in-law, you are saved from me, as you have taken refuge in the Lord.Otherwise I would have beaten you black and blue!

In Telugu kOnEru is also called tIrtham which means something that purifies. The Lord is called kOnETi rAyaDu because He is the One Who enters our mind and purifies us.